- హెచ్ఎంఎస్ నాయకులు
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియా వర్క్ షాప్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని హెచ్ఎంఎస్ నాయకులు అన్నారు. ఈ మేరకు శుక్రవారం హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ డీజీఎం రవీందర్ కు కార్మికుల సంతకాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ నాయకులు మాట్లాడుతూ… వర్క్ షాప్ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం ఆన్లైన్ నమోదులో పూర్తిగా తప్పుల తడకగా నమోదు అయ్యాయని తెలిపారు. వెంటనే ప్రత్యేక సిబ్బందిని నియమించి వర్క్ షాప్ లోనే సరి చేయాలని డిమాండ్ చేశారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగినప్పటి నుండి ఎక్కడా లేని విధంగా అవుట్ మాస్టర్ మూడు గంటలకు బదులుగా 20 నిమిషాలు ఆలస్యంగా నమోదు చేస్తున్నారని, గతంలో మాదిరిగా 3 గంటలకే అవుట్ మాస్టర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వాష్ రూమ్ లేక మహిళా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారికి వాష్ రూములు, రెస్ట్ హాళ్లు నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ వైస్ ప్రెసిడెంట్ తిప్పారపు సారయ్య, బ్రాంచ్ కార్యదర్శి అనిల్ రెడ్డి, వర్క్ షాప్ పిట్ కార్యదర్శి పొన్నగంటి అశోక్, సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం లక్ష్మణ్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.