వాస్తు శిల్పి, ప్రతిమశాస్త్ర పితామహుడు విరాట్ విశ్వకర్మ

వాస్తు శిల్పి, ప్రతిమశాస్త్ర పితామహుడు విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి. రాహుల్, డి.సి.పి. సుధీర్ రామ్నాథ్ కేకన్, బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్యతో కలిసి విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతుల విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని, ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని తెలిపారు. పర్యావరణ పరిశుభ్రత, కాలుష్య నియంత్రణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా చెరువు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని తెలిపారు. విద్యావంతులు, మేధావులు తమ వంతు బాధ్యతగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో మట్టి వినాయక విగ్రహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యమ్రంలో భాగంగా దాదాపు 200 కోట్ల మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతుందని, ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యత ఏర్పడి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో 10 వేల సీడ్ గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని, వచ్చే సంవత్సరం మట్టి విగ్రహాల ఉచిత పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విఘ్నాలకు అధిపతిగా పూజించే వినాయకుడి కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ కుమార్, జిల్లా శాఖల అధికారులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

వాస్తు శిల్పి, ప్రతిమశాస్త్ర పితామహుడు విరాట్ విశ్వకర్మ

వాస్తు శిల్పి, ప్రతిమశాస్త్ర పితామహుడు విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి. రాహుల్, డి.సి.పి. సుధీర్ రామ్నాథ్ కేకన్, బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్యతో కలిసి విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతుల విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని, ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని తెలిపారు. పర్యావరణ పరిశుభ్రత, కాలుష్య నియంత్రణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా చెరువు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని తెలిపారు. విద్యావంతులు, మేధావులు తమ వంతు బాధ్యతగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో మట్టి వినాయక విగ్రహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యమ్రంలో భాగంగా దాదాపు 200 కోట్ల మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతుందని, ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యత ఏర్పడి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో 10 వేల సీడ్ గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని, వచ్చే సంవత్సరం మట్టి విగ్రహాల ఉచిత పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విఘ్నాలకు అధిపతిగా పూజించే వినాయకుడి కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ కుమార్, జిల్లా శాఖల అధికారులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment