ఆర్.కె న్యూస్, నస్పూర్: విజ్ఞానం కోసం విద్యార్థులు సైన్స్ పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా స్థాయి జిజ్ఞాస సంచార ప్రయోగశాల నిర్వహకులు సాయి కుమార్, సంపత్ లు తెలిపారు. శుక్రవారం నస్పూర్ మండలంలోని సింగపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జిల్లా సైన్స్ ఆఫీసర్ మధుబాబు పర్యవేక్షణలో విద్యార్థులకు సైన్స్ పై అవగాహన కల్పించారు. మానవ శరీరం, అంతర్గత అవయవాల పనితీరు, ప్రయోగ పరికరాల పని విధానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మహేశ్వర్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.
213