ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు మంగళవారం నస్పూర్ పట్టణంలోని శ్రీ రెయిన్ బో స్కూల్ లో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీరాంపూర్ ఏరియా సేవా అధ్యక్షురాలు రాధా కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థినిలు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మలను ముస్తాబు చేసి సంప్రదాయ రీతిలో వేడుకలను జరుపుకున్నారు. విద్యార్థినిలు సాంప్రదాయ దుస్తుల్లో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లు చెన్నూరి అమన్ ప్రసాద్, చెన్నూరి మానసలు మాట్లాడుతూ తెలంగాణ ఆచార సంప్రదాయాలకు ప్రతీక, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక బతుకమ్మ పండుగ అన్నారు. అనంతరం బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం బతుకమ్మ పోటీ నిర్వహించి, విజేతకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రజిని, సుధా రావు, సుధా రాణి, ఉపాధ్యాయిని బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
123