మంచిర్యాల జిల్లాలో ఈ నెల 20, 25, 29 తేదీల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించనున్న సదరం శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి బి. శేషాద్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగ ధృవీకరణ పత్రం పొందుటకు అర్హులైన వారు మీ-సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని నిర్ణీత తేదిలలో శిబిరానికి హాజరు కావాలని, ధ్రువీకరణ పత్రం కాలపరిమితి ముగిసి పునరుద్ధరణతో పాటు నూతన ధృవీకరణ పత్రం కొరకు అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు. ఈ నెల 20న శారీరక వికలాంగులు-ఆర్థో (50 మంది), 25న కంటిచూపు (30), 29న మూగ, చెవుడు (50), మానసిక వికలాంగులు (50) అభ్యర్థులు సకాలంలో శిబిరాలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
215