– టీబీజీకేఏస్ నాయకుల పై చేస్తున్న దుష్ప్రచారాన్ని కార్మిక వర్గం తిప్పికొట్టాలి
– టీబీజీకేఏస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్
సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులు సాధించిన ఘనత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికే దక్కుతుందని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ3 గనిపై బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ద్వార సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టకుండా కార్మికులకు 60 కి పైగా హక్కులు తీసుకువచ్చామని, సింగరేణి కార్మిక వర్గాన్ని ఓటు అడిగే హక్కు తమకు మాత్రమే ఉందన్నారు. కారుణ్య నియామకాలు, ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ల ద్వారా 19 వేలకు పైగా ఉద్యోగాలు సింగరేణిలో వచ్చేలా చేశామని, 190 మస్టర్స్ నిండిన బదిలీ వర్కర్లను సంవత్సరంలోపు పర్మనెంట్ చేయించిన చరిత్ర టీబీజీకేఎస్ కు ఉందన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సింగరేణి 49 శాతం వాటాను కేంద్రానికి అప్పజెప్పే సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ఏమాత్రం పట్టించుకోలేదని, కార్మికులకు అన్యాయం చేయాలని చూసిందన్నారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్లకు కార్మిక వర్గాన్ని ఓటు అడిగే హక్కు లేదన్నారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, పర్సెంట్ విద్యుత్ చార్జీల రద్దు, కార్మికుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం, క్యాడర్ స్కీమ్ సమస్య పరిష్కారం, పారదర్శకంగా సర్ఫేస్ జనరల్ మజ్దూర్ లకు అవకాశం కల్పించడం, మహిళా అభ్యర్థులకు ఉద్యోగాలు, 10 లక్షల వడ్డీ లేని గృహ రుణంతో ఒక్కొక్క కార్మికుడికి దాదాపు నెలకు 4 నుంచి 5 వేల రూపాయలు మేలు జరుగుతుందని, ఇలాంటి ఎన్నో హక్కులు సాధించిన టీబీజీకేఎస్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందని అన్నారు. కొంతమంది టీబీజీకేఎస్ నాయకుల పై యూనియన్ మారతారని దుష్ప్రచారం చేస్తున్నారని, ముఖ్య నాయకులు ఎవరు యూనియన్ మారరని, దుష్ప్రచారాన్ని కార్మిక వర్గం తిప్పికొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షులు డికొండ అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, ఏరియా జిఎం చర్చల ప్రతినిధులు వెంగల కుమారస్వామి,పెట్టం లక్ష్మణ్, కాశి రావు, బ్రాంచ్ సెక్రటరీలు పానుగంటి సత్తయ్య, కానుగంటి చంద్రయ్య, బ్రాంచ్ నాయకులు అన్వేష్ రెడ్డి, చెరాలు, పిట్ సెక్రటరీ రిక్కల గోపాల్ రెడ్డి, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ సాదుల భాస్కర్, నాయకులు గోపి నాయక్, ఉత్తేజ్ రెడ్డి, సుధాకర్, మైన్ కమిటీ,సేఫ్టీ కమిటీ క్యాంటీన్ కమిటీ, టెంపుల్ కమిటీ నాయకులు, షిఫ్ట్ సెక్రటరీలు, యువ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
260