నస్పూర్ (ఆర్.కె న్యూస్): సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని కోరుతూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. బుధవారం శ్రీరాంపూర్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్)గా నియమించబడిన ఎల్.వి సూర్యనారాయణను గోదావరిఖని సింగరేణి గెస్ట్ హౌస్ లో బ్రాంచ్ అధ్యక్షులు గుల్ల బాలాజీ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఆర్గనైజర్ సెక్రటరీ వెంగల శ్రీనివాస్, బ్రాంచ్ నాయకులు పెరుక సదానందం, గోదావరిఖని నాయకులు ఆరెపల్లి రాజమౌళి, నరహరి రావు తదితరులు పాల్గొన్నారు.
105