49
నస్పూర్, ఆర్.కె న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద ప్రత్యేక చొరవ తీసుకుని సింగరేణి మారుపేర్ల బాధితుల విజిలెన్స్ కేసుల సమస్యలకు పరిష్కారం చూపి, డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని మారుపేర్ల బాధితులు దబ్బెట అంజయ్య, రాజయ్య, సంకీర్త్ లు తెలిపారు. శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎన్నో ఏండ్లు సింగరేణి సంస్థలో పని చేసి సంస్థ పురోభివృద్ధికి కృషి చేశామని, తమ వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు రాక ఆర్థికంగా చితికిపోయి, దుర్భర జీవితాలు గడుపుతున్నామని, పలుమార్లు డిప్యూటీ సీఎంతో పటు పలువురు మంత్రులకు, కార్మిక సంఘాల నాయకులకు వినతి పత్రాలు అందజేశామని, జూన్ 27న సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట మారుపేర్ల బాధితులంతా కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టినట్లు పేర్కొన్నారు.