ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. బుధవారం సీసీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై చేపట్టిన వాహన తనిఖీల్లో 7 లక్షల రూపాయల నగదు పట్టుకున్నట్లు సీసీసీ నస్పూర్ ఎస్ఐ ఎం. రవి కుమార్ తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా కె. స్వామినాథం వద్ద 7 లక్షల లభించాయని, సరైన ఆధారాలు చూపకపోవడంతో సదరు డబ్బును సీజ్ చేసి తదుపరి విచారణ నిమిత్తం ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ కు అప్పగించినట్లు ఎస్ఐ రవి కుమార్ తెలిపారు.
15 November 2023
✅ కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్
✅ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ గెలిపించాలి
✅ మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు
కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం అయిన ఐఎన్టీయూసీ, ఇతర జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె5 గని వద్ద మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కార్మికులను కోరారు. కోల్ ఇండియాలో లేని ఎన్నో హక్కులకు సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ కల్పించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, టీబీజీకేఎస్ లను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షులు ఢీకొండ అన్నయ్య, చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, జిఎం చర్చల ప్రతినిధులు పెట్టేం లక్ష్మణ్, కాశి రావు, బ్రాంచ్ కార్యదర్శి రమేష్, పిట్ కార్యదర్శి మహేందర్ రెడ్డి, నాయకులు రౌతు సత్యనారాయణ, మల్లేష్, శ్రీనివాసరావు, నీలం సదయ్య, అన్వేష్ రెడ్డి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
– బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనను మంచిర్యాల ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే నస్పూర్ మున్సిపాలిటీ నీ స్మార్ట్ సిటీగా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ అన్నారు. బుధవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని విలేజ్ నస్పూర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. విలేజ్ నస్పూర్ ప్రజలను ప్రస్తుత ఎమ్మెల్యే దివాకర్ రావు నిర్లక్ష్యం చేశాడని, స్థానికంగా సరైన రోడ్లు లేవని, తాగునీటి సమస్య పరిష్కరించడంలో మ్మెల్యే దివాకర్ రావు విఫలం అయ్యాడన్నారు. చెల్లని పట్టాలు ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు నస్పూర్ పేద ప్రజలను మోసం చేశాడని అన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగు నీరు, సరైన రహదారులు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అగల్ డ్యూటీ రాజు, జి.వి ఆనంద్, సత్రం రమేష్, ఈర్ల సదానందం, మిట్టపల్లి మొగిలి, సిరికొండ రాజు, కొరెపు మహేందర్, రనవేణి శ్రీను, కుర్రే చక్రి, మద్ది సుమన్, కొంతం మహేందర్, తాడూరి మహేష్, బద్రి శ్రీకాంత్, తిరుపతి, కట్కూరి సతీష్, బుసరపు తిరుపతి, కామ రాజు, కొండ్ర రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.