– సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్
ఆర్.కె న్యూస్, నస్పూర్
సింగరేణిలో నిజాయితీగా పనిచేసే యూనియన్ రావాలని, అందుకే మార్పు రావాలని, సిఐటియు గెలవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే5, ఎస్సార్పీ 3 గనులపై జరిగిన గేట్ మీటింగ్ లలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ, కార్మికుల ఓట్లతో గెలిచి నిజాయితీగా పనిచేయాల్సిన సంఘాలు ప్రతి పనికి రేటు కట్టి కార్మికులను ఇబ్బందులకు గురి చేశాయని, నిజాయితీగా పనిచేసే సిఐటియును గెలిపించాలని కోరారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, రఘునందన్ రావు లాంటి వారిని హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమల్లో ఓడించామని, సింగరేణిలో సైతం అవినీతి అంతం చేయడానికి సిఐటియు ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మెడికల్ బోర్డులలో, ప్రమోషన్లలో అవినీతి జరుగుతుందని, కార్మికుడు పదవీ విరమణ పొందిన తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ సైతం ఇవ్వడానికి అనేక ఇబ్బందులు పడుతున్న తీరును కార్మికులు గమనించాలని, ప్రతి కార్మికుడు తన జీతంలో నుండి మూడు నాలుగు నెలలు టాక్స్ కడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను పట్టించుకోకుండా చివరకు దాచుకున్న పట్టు పైసలు సైతం టాక్స్ వేసేలా చట్టాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అధిక శాతం వాటాదారుగా ఉన్న సింగరేణి భూగర్భ గనుల అనుమతులు తెచ్చుకోవడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వం ఏదైనా కార్మికులకు వ్యతిరేకమే అని, ప్రభుత్వ అనుబంధ సంఘాలతో కార్మికులకు ఒరిగేదేమీ లేదని, ఇన్ని రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వ అనుబంధ సంఘం టీబీజీకేఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయుసీ వచ్చిన రేపు అదే జరుగుతుందని కార్మికులు గమనించాలని కోరారు. ఏఐటీయూసీ గెలిచిన ఏరియాలో ఒక తీరు, ఓడిన ఏరియాలో ఒక తీరు ఆందోళన చేస్తున్న విషయాన్ని గమనించాలని, స్థానిక సమస్యల పైన సిఐటియు చేస్తున్న పోరాటాలను గమనిస్తున్న కార్మికులు ఈసారి పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి, దుంపల రంజిత్ కుమార్, డివిజన్ కార్యదర్శి గోదారి భాగ్యరాజ్, బ్రాంచ్ అధ్యక్షులు బాలాజీ, ఆర్గనైజర్ వెంగళ శ్రీనివాస్, అజయ్, సాయిల శ్రీనివాస్, సదానందం, మిడివెల్లి శ్రీనివాస్, నరేష్, రవీందర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
13 December 2023
ఆర్.కె న్యూస్, నస్పూర్
సింగరేణి కార్మికుల హక్కులను ఐఎన్టీయూసీ మాత్రమే సాధిస్తుందని ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు కలవేన శ్యామ్ లు తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ3 గనిపై జరిగిన గేట్ మీటింగ్ లో వారు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఘన విజయాన్ని అందించి, ప్రభుత్వ ఏర్పాటులో సింగరేణి కార్మిక వర్గం భాగస్వామ్యం అయినట్టే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గడియారం గుర్తుకు ఓటేసి ఐఎన్టీయూసీ ని గెలిపించాలని, ఐఎన్టీయూసీని గెలిపిస్తేనే సింగరేణి సంస్థకు మనుగడ ఉంటుందని, లేనిపక్షంలో కార్పొరేట్ పెట్టుబడిదారులకు నిలయంగా మారుతుందని తెలిపారు. సింగరేణిలో ఉన్న అన్ని విభాగాల ఉద్యోగులు, కార్మికులకు రావాల్సిన హక్కులు సాధిస్తామని, భవిష్యత్తులో నూతన ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని, యజమాన్యం సకాలంలో కార్మికులకు స్వేటర్లు, బూట్లు, సాక్సులు నాణ్యమైన పనిముట్లు అందించడం లేదని, పని స్థలాల్లో రక్షణ చర్యలు కరువయ్యాయని, యాజమాన్యం రక్షణ చర్యలు మీద దృష్టి పెట్టాలని, ప్రశ్నించే కార్మిక సంఘం నాయకులు కరువయ్యారని, పైరవీలు లంచాలకు అలవాటు పడిన అధికారులు, నాయకులు ఉన్నారని, వీటన్నింటికి స్వస్తి పలకాలన్నా, యజమాన్యం నిరంకుశ విధానాలను తిప్పి కొట్టాలన్న ఒక్క ఐఎన్టీయూసితోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గరిగె స్వామి, సమ్ము రాజన్న, రాఘవ రెడ్డి, శీలం చిన్నయ్య, నర్సింగ్, మనోజ్, సమ్మిరెడ్డి, మహేష్, చంద్రమోహన్, వెంకటస్వామి, సుధాకర్, శ్రీనివాస్, వీరమల్లు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్రిష్ణ కాలనీ గీత ప్రశాంతి నిలయంలో నిర్వహిస్తున్న గీతా జయంతి, శ్రీమద్భగవద్గీత సత్సంగం రజతోత్సవ వేడుకలకు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సత్సంగ అధ్యక్షులు భక్త రాజేశం గురూజీ తెలిపారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 13 నుండి 23 వరకు నిర్వహిస్తున్న వేడుకలలో శ్రీహరి మౌనస్వామి, విష్ణు సేవా నందగిరి స్వాములు వస్తున్నారని, అనేక ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకుంటూ, పూజలు, యజ్ఞములతో పాటు అనేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కోలాట, భజనలతో శోభాయాత్ర ఉంటుందన్నారు. పాఠశాల విద్యార్థులచే భగవద్గీత పారాయణం ఉంటుందన్నారు. భగవద్గీతను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, భగవద్గీతను అధ్యనం చేయడం ద్వారా ఆధ్యాత్మిక తత్వం పెంపొందుతుందన్నారు. మంచి పనులు చేస్తూ, శాంతి, భక్తి మార్గంలో జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో మారపెల్లి సారయ్య, డిడి ప్రసాద్, లక్ష్మీనారాయణ, సాంబారి రాజేశం, రాంబాబు, రాజమౌళి, రాజేశ్వరి, స్వర్ణ, లక్ష్మి, సత్యవతి, రమదేవి, అనసూయ తదితరులు పాల్గొన్నారు.
– కార్మికుల సొంత ఇంటి పథకం అమలుకు కృషి
– గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించాలి
– ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
– ఏఐటీయూసీలో చేరికలు
ఆర్.కె న్యూస్, నస్పూర్
సింగరేణి కార్మికుల హక్కుల సాధన ఏఐటీయూసీతోనే సాధ్యమని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్, ఎస్సార్సీ 1 గనుల పై నిర్వహించిన ద్వార సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ ఈనెల 27న జరుగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగి, కార్మిక వర్గ హక్కులు, సౌకర్యాలే ధ్యేయంగా పని చేస్తున్న ఏఐటీయూసీని నక్షత్రం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మికులను కోరారు. రాబోయే ఎన్నికల్లో ఐటీయూసీని గుర్తింపు సంఘంగా గెలిపిస్తే కోల్ ఇండియా మాదిరిగా అలవెన్స్ లపై పడే టాక్స్ సింగరేణి కార్మికులకు ఇప్పిస్తామన్నారు. ప్రతి కార్మికునికి 200 గజాల భూమి, 20 లక్షలు వడ్డీ లేని రుణాలు యాజమాన్యంతో ఇప్పిస్తామన్నారు. సింగరేణి పాఠశాలల్లో సీబీఎస్ఈ విద్యను అమలు చేయిస్తామన్నారు. నిర్మాణ లేమితో ఉన్న కొన్ని జాతీయ సంఘాలు, ప్రాంతీయ సంఘాలు బలమైన కార్మిక ఉద్యమాలను చేయలేవని అన్నారు. విజ్ఞులైన సింగరేణి ఉద్యోగులు బాగా ఆలోచించి, విచ్ఛిన్నకర పాత్ర పోషిస్తున్న పాలకవర్గ ట్రేడ్ యూనియన్లను ,పైరవీకారి ట్రేడ్ యూనియన్లను ఓడించాలని కార్మికులను కోరారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు ఐటీయూసీలో చేరారు. వీరికి వాసిరెడ్డి సీతారామయ్య కండువా కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వీరభద్రయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ, బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కే బాజీ సైదా, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కొమురయ్య, ఆర్కే న్యూ టెక్ పిట్ సెక్రటరీ ఆకుల లక్ష్మణ్, దాడి రాజయ్య, కామెర వేణు, బెల్లంపల్లి రీజియన్ కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్షుడు అప్రోజ్ ఖాన్, హెడ్ ఓవర్ మెన్ లు చంద్రమోహన్, వెంకటేశ్వర్లు, అదే వెంకటేష్, రాజ్ కుమార్, గని కార్మికులు తదితరులు పాల్గొన్నారు.