-జిల్లా స్థాయి మున్నూరు కాపు క్యాలెండర్ ఆవిష్కరణ
-మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం
ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణాలో అత్యధికంగా ఉన్న మున్నూరు కాపులు ఐక్యతతో ముందుకు సాగాలని, రాజకీయ లక్ష్యంతోనే కుల సంఘాలు బలోపేతం అవుతాయని తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ ప్రెస్ క్లబ్ లో మున్నూరు కాపు సంఘం జిల్లా అధికార ప్రతినిధి భాస్కరి రాజేశం అధ్యక్షతన జిల్లా మున్నూరు కాపు కులస్తుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా స్థాయి మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం, యూత్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి సురేష్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరు కాపులు ఐఖ్యకంగా ఉంటే రాజకీయంగా రాణించ గలుగుతారన్నారు. రాజకీయ చైతన్యం, ఐఖ్యతతోనే సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. రానున్న మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మంది కాపు ప్రజాప్రతినిధులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపులను ఐఖ్యం చేయడంలో క్యాలెండర్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులు పడాల రవిందర్, సకినాల నర్సయ్య, మైదం రామకృష్ణ, వార్డు కన్వీనర్లు గాండ్ల అంజయ్య, పానగంటి సత్తయ్య, బొడ్డు తిరుపతి, ఆకుల నరేందర్, ఆకుల లక్ష్మన్, కర్నె శ్రీనివాస్, రాళ్లబండి రాజన్న, గుమ్మడి తిరుపతి, సీపతి సదయ్య, అగ్గు సాగర్, సోమిశెట్టి సాయి, పొగాకు రమేశ్, పెద్దపల్లి రామయ్య, అర్రవెల్లి రవీందర్, సిద్దం లింగయ్య పాల్గొన్నారు.
10 January 2024
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-న్యూటెక్ గనిపై గనుల్లో పాటించాల్సిన రక్షణ సూత్రాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బెల్లంపల్లి రీజియన్ జీఎం (రక్షణ) కె. హరి నారాయణ గుప్తా ఉద్యోగులకు అవగాహన కల్పించారు. బుధవారం గని ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరికీ గనుల్లో జరిగే ప్రమాదాలపై పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మానవ ప్రమేయ ప్రమాదాలను తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం ఉద్యోగులతో కలిసి రక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఏజెంట్ మాలోత్ రాముడు, గని ఎస్ఓఎం స్వామి రాజు, రక్షణాధికారి కొట్టె రమేష్, సంక్షేమాధికారి పాల్ సృజన్, ఇంజనీర్ కృష్ణ, వెంటిలేషన్ అధికారి చంద్రమౌళి, సర్వే అధికారి పిచ్చేశ్వర్ రావు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.