ఆర్.కె న్యూస్, నస్పూర్: ఇటీవల పదవీ విరమణ పొందిన శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డిని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఘనంగా సన్మానించారు. ఆదివారం నస్పూర్ పట్టణంలోని బంగ్లా ఏరియాలో జరిగిన కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే మాట్లాడుతూ బి. సంజీవ రెడ్డి తన సర్వీస్ కాలంలో సింగరేణి సంస్థకు అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎల్.వి సూర్యనారాయణ, ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, జనరల్ మేనేజర్ (సేఫ్టీ, బెల్లంపల్లి రీజియన్) రఘు కుమార్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, జనరల్ మేనేజర్ (సివిల్) శ్రీనివాస రావు, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కె. వెంకటేశ్వర్ రెడ్డి, అన్ని విభాగాల అధిపతులు, అన్ని గనుల మేనేజర్లు, అధికారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
3 November 2024
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎల్.వి సూర్యనారాయణ ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ గా ఎల్.వి సూర్యనారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జీఎం బి. సంజీవ రెడ్డి ఇటీవల పదవీ విరమణ పొందటంతో ఆర్.జి 2 జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న ఎల్.వి సూర్యనారాయణ బదిలీపై శ్రీరాంపూర్ ఏరియాకు వచ్చారు. ఇన్చార్జి జనరల్ మేనేజర్ టి శ్రీనివాస్ పూల బొకె తో నూతన జీఎం ఎల్.వి సూర్యనారాయణకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, ఏజెంట్లు రాముడు, శ్రీధర్, డీజీఎంలు పి. అరవింద రావు, చిరంజీవులు, ఆనంద్ కుమార్, డివైసీఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబు, చంద్రలింగం, ఏరియా సర్వే అధికారి వెంకటేశం, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జక్క రెడ్డి, ఏరియా ఎస్టేట్ అధికారి వరలక్ష్మి, పర్చేస్ అధికారి చంద్రశేఖర్, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ హనుమాన్ గౌడ్, వివిధ గనుల విభాగాల అధిపతులు, మేనేజర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, గ్రూప్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.