- ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఎస్ అండ్ పిసి సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ద్విచక్ర వాహనం నడిపే సమయంలో విధిగా హెల్మెట్ ధరించి విధులకు హాజరు కావాలని శ్రీరాంపూర్ ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి అన్నారు. సోమవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ అండ్ పిసి కార్యాలయ ఆవరణలో మొదటి, రెండవ షిఫ్ట్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు రహదారి భద్రత పై అవగాహన కల్పించారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సెక్యూరిటీ గార్డులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీర్ఘకాలిక గైర్హాజరు సెక్యూరిటీ గార్డుల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఇన్స్పెక్టర్లు పోగుల స్వామి, రామిరెడ్డి, జూనియర్ ఇన్స్పెక్టర్ రాజయ్య, జమ్మేదార్ లు బడికెల రామచందర్, దాస్, శ్రీనివాస్, కనకయ్య, నాగ మల్లేష్, ఎఫ్ఎంఎస్ సూపర్వైజర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.