నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా రగ్బీ జట్టును అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని కెజిఎ డిఫెన్స్ అకాడమీ గ్రౌండ్ లో అండర్ 15 బాల బాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ, రగ్బీ క్రీడను అన్ని మండలాల్లో అభివృద్ధి చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించే విధంగా శిక్షణ శిబిరలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించి మంచిర్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కెజిఎ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ కుమార్, కోచ్ రమేష్, పీఈటి లు దేవేందర్, వెంకటేష్, సురేష్, ధరణ్, నరసింహులు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
27 January 2025
- గుర్తింపు కార్మిక సంఘం నాయకులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఉపరితల గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం నాయకులు అన్నారు. సోమవారం సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) నాయకులు శ్రీరాంపూర్ ఉపరితల గనిని సందర్శించి, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘం డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదాలు మాట్లాడుతూ, శ్రీరాంపూర్ ఉపరితల గని లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఓపెన్ కాస్ట్, సి.హెచ్.పి సెక్షన్ ను వేరు చేయాలని, ఎలక్ట్రిషన్, ఫిట్టర్, సూపర్వైజర్ ల కొరత ఉందని, కార్మికులకు సరిపడా షేడ్స్ వెంటనే నిర్మించాలని, కార్మికులకు సరిపడా ప్లే డేలు మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను ఓసీపీ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లగా, సానుకూలంగా స్పందించిన ఓసీపీ మేనేజర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య , సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, ఫిట్ కార్యదర్శి మోతే లచ్చన్న, బ్రాంచ్ నాయకులు గండి సతీష్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, నాయకులు ఆళ్ల వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, దుబాల రవి తదితరులు పాల్గొన్నారు.