4 April 2025
నస్పూర్, ఏప్రిల్ 04 (ఆర్.కె న్యూస్): నస్పూర్ – శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా భూపతి రవి ఎన్నికయ్యారు. గురువారం రాత్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా కొండా శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా భాస్కరి రాజేశం, ఉపాధ్యక్షులుగా శ్రీపతి రాములు, మైదం రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా క్యాతం రాజేష్, జాయింట్ సెక్రటరీగా ఏల్పుల మల్లేష్, ఫైనాన్స్ సెక్రటరీగా కేశిరెడ్డి నారాయణ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా తలారి సమ్మయ్య, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా కోడం రవి కుమార్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భూపతి రవి మాట్లాడుతూ, నూతన కమిటీ కాల పరిమితి రెండు సంవత్సరాలు ఉంటుందని, ప్రెస్ క్లబ్ పురోభివృద్ధికి, సభ్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.