ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ సినీ నటి విజయశాంతిని శుక్రవారం సాయంత్రం పలువురు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు, సినీ నటులు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల కష్టాలు, త్యాగాలు మరువలేనివి అని, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. ఎమ్మెల్సీ విజయశాంతిని కలిసిన వారిలో సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఎం.బాబు రావు, ఏ.వేణుమాధవ్, సినీ నటులు, యూట్యూబ్ నిర్మాతలు, నటులు సుచరిత, రత్న శ్రీ హారిక, మహాలక్ష్మి, నిర్మాతలు ఇంద్రకంటి దీప, ఫేమస్ బుల్లెట్ బండి సాంగ్ నిర్మాత నిరుపమ, డబ్బింగ్ అరిస్టు స్రవంతి, ఎస్.బి రెడ్డి క్రియేషన్స్ ఎస్.బి రెడ్డి తదితరులు ఉన్నారు.
Daily Archives