నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణానికి చెందిన వంగపెల్లి సహస్ర బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్టు మంచిర్యాల ఎస్ఆర్ డిజి స్కూల్ ప్రిన్సిపాల్ కొడారి కుమారస్వామి తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులు వంగపెల్లి చంద్రశేఖర్, రజితలు కిరణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ డిజి స్కూల్ డీజీఎం లక్ష్మణ రావు, జోనల్ ఇంచార్జ్ అనంతుల శశిధర్, ఉపాధ్యాయులు సహస్రను అభినందించారు.
Daily Archives
1 August 2025
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలోని సింగరేణి కాన్ఫరెన్స్ హాల్ లో మంచిర్యాల జోన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్ ను 2000వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన హెడ్ కానిస్టేబుళ్లు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీకి పూల మొక్క అందజేసి, శాలువాతో సత్కరించారు. 2000వ సంవత్సరంలో అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్ వరంగల్ జిల్లా మామునూరు పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు తాము శిక్షణ పొందినట్లు వారు తెలిపారు. అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్ ను కలిసిన వారిలో కానిస్టేబుళ్లు బుద్దె రవి, ఉపేందర్, రాజు, రవి, మల్లా రెడ్డి, చంద్రమోహన్, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.