మంచిర్యాల, ఆర్.కె న్యూస్: ఈనెల 26 నుంచి కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలో జరుగనున్న జాతీయ స్థాయి పెన్ కాక్ సిలట్ మార్షల్ ఆర్ట్స్ పోటీలకు మంచిర్యాల నారాయణ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి కామిడి హ్రీద్య ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారాయణ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తున్నామని, క్రీడల వల్ల విద్యార్థుల మానసిక, శారీరక స్థితి అభివృద్ధి చెందుతుందని, క్రీడలతో భవిష్యత్తులో విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించడానికి, మంచి ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుందని పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి తెలిపారు.
Daily Archives