వేమనపల్లి, ఆర్.కె న్యూస్: నీల్వాయి నూతన ఎస్సైగా జగదీశ్వర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజలకు ఏ అవసరం ఉన్న నేరుగా వచ్చి తమను కలవచ్చని ఆయన పేర్కొన్నారు.
Daily Archives
30 October 2025
రామకృష్ణాపూర్, ఆర్.కె న్యూస్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రేపు జాతీయ ఏక్తా దివాస్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ పోలీసులు “రన్ ఫర్ యూనిటీ” (2కే రన్)ను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఠాగూర్ స్టేడియం నుంచి రామాలయం ఏరియా వరకు 2కే రన్ జరుగుతుంది. పటేల్ ఆశయాలను స్మరించుకుంటూ, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పట్టణ ఎస్సై రాజశేఖర్ పిలుపునిచ్చారు.



