జాతీయ స్థాయిలో మదీహా సదీమ్ ప్రథమ స్థానం
మంచిర్యాల, ఆర్. కెన్యూస్: డిసెంబర్ నెలలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (ఐఎన్టీఎస్ఓ) పరీక్షల్లో మంచిర్యాల లక్ష్మీనగర్ బ్రాంచ్ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అఖిల భారత స్థాయిలో 9వ తరగతి విద్యార్థిని మదీహా సదీమ్ ప్రథమ బహుమతి సాధించి అగ్రస్థానంలో నిలిచింది. పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రిన్సిపాల్ అయూబ్ టాపర్లను అభినందించారు. ఈ పోటీల్లో వివిధ తరగతుల విద్యార్థులు ఉన్నత స్థానాలను కైవసం చేసుకున్నారు. 7వ తరగతికి చెందిన జగదీశ్వర్, 5వ తరగతి రిషిత ద్వితీయ బహుమతులు సాధించారు. 6వ తరగతి విద్యార్థిని రాంటెంకి సహస్ర, 3వ తరగతి సుహాన్ అనురాగ్ తృతీయ బహుమతులు పొందారు. 8వ తరగతికి చెందిన వొల్లాల శ్రీ హర్ష, 4వ తరగతి ప్రణవ్ నాలుగో బహుమతి గెలుచుకున్నారు. 5వ తరగతి శ్రీనిత్య, 7వ తరగతి అక్షిత ఐదో బహుమతిని అందుకున్నారు. జాతీయ స్థాయిలో పాఠశాల పేరు నిలబెట్టిన విద్యార్థులను చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం అరవింద్రెడ్డి ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త జయరాజ్, మంచిర్యాల సమన్వయకర్త నాగరాజు, జయశ్రీ, డీన్ శ్యామ్, ప్రాథమిక ఇంచార్జి అనగమాత విద్యార్థులను అభినందించిన వారిలో ఉన్నారు.



