క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలుగుతుందని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని ప్రగతి స్టేడియంలో శ్రీరాంపూర్ జీఎం క్రీడాకారులను పరిచయం చేసుకుని, సింగరేణి వార్షిక క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలు నిర్వహించుకోవాలన్నారు. సింగరేణి యాజమాన్యం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ, క్రీడాకారులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందన్నారు. సింగరేణి సంస్థ యువ యువ ఉద్యోగులతో కళకళలాడుతోందని, యువ ఉద్యోగులు క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. త్వరలో క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేస్తామన్నారు. నెలలోపు ప్రగతి మైదానంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని, నాగార్జున కాలనీ గ్రౌండ్ పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఎస్వోటు జీఎం రఘు కుమార్, డీజీఎం (పర్సనల్) అరవింద్ రావు, స్పోర్ట్స్ హానరి సెక్రటరీ పాలకుర్తి రాజు, స్పోర్ట్స్ సూపర్ వైజర్ చాట్ల అశోక్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సురేష్, జనరల్ కెప్టెన్ గోపాల్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
260