దక్షిణ భారత దేశంలోనే ఏకైక బొగ్గు రంగ సంస్థ సింగరేణి తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది. సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లో దాదాపు 11 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత ,కార్మిక సంఘాల ఐక్య పోరాటాల వలన, జాతీయ సంఘాల కృషి వలన 11 వ వేజ్ బోర్డులో సింగరేణి ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగాయి. కానీ, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెంపు, అపరిమిత ఉచిత వైద్య సౌకర్యాలు, కార్మికులకు, అధికారులకు గ్రాట్యుటీ 20 లక్షల సీలింగ్ అమలు పరిచే తేదీల్లో వ్యత్యాసం ఇలాంటి బొగ్గు విశ్రాంత కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందనంగా ఉంది. రాబోవు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పై సమస్యల ప్రభావం ఉంటుంది. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యల పై చర్చించి పరిష్కరించాలని సింగరేణి ప్రాంత శాసన సభ్యులను,పార్లమెంట్ సభ్యులను కార్మిక సంఘ నాయకులను విశ్రాంత ఉద్యోగులు వేడుకుంటున్నారు.
ఆళవందార్ వేణు మాధవ్
ఉపాధ్యక్షులు, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్