2వ ఓటరు జాబితా సంక్లిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా గిరిజనులను ఓటరు జాబితాలో చేర్చేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరుగుతుందని మంచిర్యాల రాజస్వ మండల అధికారి రాములు తెలిపారు. శుక్రవారం నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో సవరణలపై మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని ఎన్.టి.ఆర్. నగర్ కాలనీలో మంచిర్యాల మండల తహసీల్దార్ భోజన్నతో కలిసి ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో 18, 19 సంవత్సరాల వయసు నిండిన గిరిజనుల వివరాలు ఓటరు జాబితాలో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఓటు హక్కు విలువ, ఎన్నికల సమయంలో ఓటు వినియోగం ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ గడియారం శ్రీహరి, వార్డు కౌన్సిలర్ సుంకరి శ్వేత, బదావత్ ప్రకాష్, బూత్ స్థాయి అధికారి రేణుక, తోటి, మన్నె డ్రైవ్ కమ్యూనిటీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
291