వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంకమట్టితో తయారు చేసిన మూడు వేల వినాయక ప్రతిమలను మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా విద్యాశాఖ కార్యాలయం, జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందికి మట్టి వినాయక ప్రతిమలను అందించారు. ఈ సందర్భంగా నేషనల్ గ్రీన్ కోర్ రాష్ట్ర శిక్షకుడు, పర్యావరణవేత్త, గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వలన నీరు కలుషితం అవుతుందని, అందరూ పర్యావరణహితమైన బంక మట్టి వినాయకులను పూజించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీ.ఈ. ఓ కార్యాలయం సూపరింటెండెంట్లు సత్యనారాయణ, నవీన్, రాజ్ కుమార్, హెచ్ ఎం వేణుగోపాల్, కార్యాలయ సిబ్బంది సిబ్బంది, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ మధు బాబు, పాఠశాల ఉపాధ్యాయులు, కృష్ణవేణి విద్య సంస్థల అధినేత కస్తూరి పద్మ చరణ్, కస్తూరి ఫౌండేషన్ సభ్యులు పర్వతి సుగుణాకర్, కస్తూరి సిద్ధార్థ్, సురకాని సత్యం తదితరులు పాల్గొన్నారు.
279