అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

మంచిర్యాల జిల్లాలో మన ఊరు మన బడి, గ్రామ పంచాయతీ కార్యాలయాల భవన నిర్మాణాల పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి. రాహుల్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రితో కలిసి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు పాలనాధికారి మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలతో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం మొదటి విడతలో జిల్లాలో 248 పాఠశాలలు ఎంపిక చేయబడి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అదనపు తరగతి గదులు, మూత్రశాలలు, శౌచాలయాలు, భోజనశాల, వంటశాల, ప్రహారీ గోడల నిర్మాణం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన పనులతో పాటు మరమ్మత్తులను చేపట్టడం జరిగిందని, ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ క్రమంలో పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా మండల విద్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గ్రామ స్థాయి నుండి అభివృద్ధి చేసే దిశగా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు శాశ్వత భవనాలు ఉండాలనే ఉద్దేశ్యంతో జిల్లాలో చేపట్టిన గ్రామ పంచాయతీ కార్యాలయాల భవన నిర్మాణాల భాగంగా 135 గ్రామపంచాయతీల భవనాలు మంజూరు చేయబడి 89 పనులు ప్రారంభించి కొనసాగుతున్నాయని, మిగిలిన పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేసేలా అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

మంచిర్యాల జిల్లాలో మన ఊరు మన బడి, గ్రామ పంచాయతీ కార్యాలయాల భవన నిర్మాణాల పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి. రాహుల్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రితో కలిసి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు పాలనాధికారి మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలతో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం మొదటి విడతలో జిల్లాలో 248 పాఠశాలలు ఎంపిక చేయబడి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అదనపు తరగతి గదులు, మూత్రశాలలు, శౌచాలయాలు, భోజనశాల, వంటశాల, ప్రహారీ గోడల నిర్మాణం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన పనులతో పాటు మరమ్మత్తులను చేపట్టడం జరిగిందని, ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ క్రమంలో పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా మండల విద్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గ్రామ స్థాయి నుండి అభివృద్ధి చేసే దిశగా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు శాశ్వత భవనాలు ఉండాలనే ఉద్దేశ్యంతో జిల్లాలో చేపట్టిన గ్రామ పంచాయతీ కార్యాలయాల భవన నిర్మాణాల భాగంగా 135 గ్రామపంచాయతీల భవనాలు మంజూరు చేయబడి 89 పనులు ప్రారంభించి కొనసాగుతున్నాయని, మిగిలిన పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేసేలా అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment