విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీయాలి

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 4 మండలాలలో గల 55 ప్రభుత్వ పాఠశాలల్లో డెమో స్కూల్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. శుక్రవారం జిల్లాలోని కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జిల్లాలో డెమో స్కూల్ ప్రోగ్రాం కొరకు ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పంచాయితీ కార్యదర్శులు, కస్తూరిబా గాంధీ విద్యాలయం అధికారులు, ప్రత్యేక అధికారులతో 100 రోజుల డెమో స్కూల్ ప్రోగ్రాం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే విధంగా అధికారులు సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులను గ్రూపులుగా తయారుచేసి వారి ఆలోచనలను ఇతర విద్యార్థులతో పంచుకునే కార్యక్రమాలు చేపట్టాలని, పాఠశాలల్లో అసెంబ్లీ, క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సులభతరమైన పద్ధతుల్లో విద్యాబోధన చేయాలని తెలిపారు. పిరమిడ్ సభ్యుల సహకారంతో 100 రోజుల కార్యక్రమాన్ని కొనసాగించాలని, ప్రారంభ, మధ్య, అంత్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం డెమో స్కూల్ కార్యక్రమ గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీయాలి

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 4 మండలాలలో గల 55 ప్రభుత్వ పాఠశాలల్లో డెమో స్కూల్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. శుక్రవారం జిల్లాలోని కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జిల్లాలో డెమో స్కూల్ ప్రోగ్రాం కొరకు ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పంచాయితీ కార్యదర్శులు, కస్తూరిబా గాంధీ విద్యాలయం అధికారులు, ప్రత్యేక అధికారులతో 100 రోజుల డెమో స్కూల్ ప్రోగ్రాం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే విధంగా అధికారులు సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులను గ్రూపులుగా తయారుచేసి వారి ఆలోచనలను ఇతర విద్యార్థులతో పంచుకునే కార్యక్రమాలు చేపట్టాలని, పాఠశాలల్లో అసెంబ్లీ, క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సులభతరమైన పద్ధతుల్లో విద్యాబోధన చేయాలని తెలిపారు. పిరమిడ్ సభ్యుల సహకారంతో 100 రోజుల కార్యక్రమాన్ని కొనసాగించాలని, ప్రారంభ, మధ్య, అంత్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం డెమో స్కూల్ కార్యక్రమ గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment