– మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్
ఆర్.కె న్యూస్ ,నస్పూర్: ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ స్పష్టం చేశారు. గురువారం రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నస్పూర్ మున్సిపాలిటీ సింగపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ ఆయన సతీమణి స్రవంతితో కలిసి స్థానిక మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతూ నస్పూర్ మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారం బీజేపీతోనే సాధ్యమని, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, కరోనా సమయంలో కోవిడ్ సోకిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశామని, చనిపోయిన వారికి ఆర్థిక సహాయం, వరద బాధితులకు సహాయం, నిరుద్యోగులకు ఉచిత పోలీస్, గ్రూప్స్ శిక్షణ, ఉచిత వైద్య శిబిరాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్రం రమేష్, పానుగంటి మధు, కుర్రే చక్రి, రంగు రమేష్, పులి కిష్టయ్య, మర్త నారాయణ, మార్త శంకర్, కుర్రే లింగయ్య, ముత్యాల రాయమల్లు, కోట శంకర్, జుమ్మిడి రాజేష్, కొండ వెంకటేష్, అంబాల సాగర్, సిరికొండ రాజు, రూప దేవి, స్వప్న రెడ్డి, సుమలత, కొంతం మహేందర్, బద్రి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
241