– మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను మరోసారి గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కోరారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ1 గని వద్ద మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, కారుణ్య నియామకాలతో కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపారని కోరారు. సింగరేణి కార్మికులందరూ కారు గుర్తుకే ఓటు వేయాలని, తనని మరోసారి ఎమ్మెల్యేగా దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, నాయకులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, మల్లా రెడ్డి, ఢీకొండ అన్నయ్య, పెట్టెం లక్ష్మణ్, ఎంబడి తిరుపతి, రౌతు సత్యనారాయణ, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
263