– గెలుపే లక్ష్యంగా పని చేయాలని బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం
– బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్
– ఈ నెల 19న నస్పూర్ లో ఈటెల రాజేందర్ రోడ్ షో
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగురడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నస్పూర్ పట్టణంలోని నర్సయ్య భవన్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వెరబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి చేసిందేమీ లేదని, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు గెలిస్తే ఏం చేస్తాడో అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ప్రేమ్ సాగర్ గతంలో చెల్లని పట్టాలు ఇచ్చి పేద ప్రజలను మోసం చేశాడన్నారు. స్థానిక సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని అన్నారు. ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయని, గెలుపే లక్ష్యంగా పని చేయాలని బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తనను ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం కల్పిస్తే మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ గా ఇస్తానని, 9 భరోసాలు ఖచ్చితంగా అమలు చేస్తానని అన్నారు. నస్పూర్ లో ఉన్నత విద్యా ప్రమాణాలు గల ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతాడని, ఎస్సీ వర్గీకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ నెల 19న నస్పూర్ లో జరిగే ఈటెల రాజేందర్ రోడ్ షో విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అగల్ డ్యూటీ రాజు, కృష్ణమూర్తి, సత్రం రమేష్, ఈర్ల సదానందం,పేరం రమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
217