శ్రీరాంపూర్ కాలనీకి చెందిన అయ్యప్ప భక్తులు బుధవారం అయ్యప్ప స్వామి మాలధారణ చేశారు. శ్రీరాంపూర్ ఏరియా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి బాస్కర్ల రాజేశం, ఉపాధ్యక్షుడు గుడ్డేటి రామలింగంల ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు గోదావరి పుణ్య స్నానం ఆచరించి, అయ్యప్ప దేవాలయంలో గురు స్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యలుచే అయ్యప్ప మాల ధరించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు మాట్లాడుతూ అయ్యప్ప భక్తులకు దీక్ష నియమాలు ఉపదేశించి నిష్టగా 41 రోజులు అయ్యప్ప స్వామి పూజలు చేసి ఇరుముడి దాల్చి శబరిమల వెళ్లాలని కోరారు. అయ్యప్ప స్వామి దీక్షతో భక్తులకు ఏకాగ్రత పెరుగుతుందన్నారు. డిసెంబర్ 8న గురువారం శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియంలో కేరళకు చెందిన సంజీవ నంబూద్రి గురుస్వామిచే అయ్యప్ప స్వాముల సామూహిక మహా పడిపూజ, అయ్యప్ప స్వాముల మహా సంగమం, అగ్ని గుండాల ప్రవేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వంగ శ్రీనివాస్, సీహెచ్ సదానందం, వేణు, కొండల్ రెడ్డి, శ్రావణ్, బన్నీ, శేఖర్, బజ్జూరి, సురెందర్, రమేష్, చందర్, పప్పు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
274