బొగ్గు విశ్రాంత కార్మికులను ఆదుకోండి

 

గాలి, వెలుతురు సరిగ్గా లేని చీకటి బొగ్గు గనుల్లో 30 నుంచి 40 సంవత్సరాలు తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడ్డ బొగ్గు గని విశ్రాంత కార్మికులు దేశ వ్యాప్తంగా ముఖ్యంగా బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర దక్షిణ భారత దేశంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో నివసిస్తున్నారు. సింగరేణిలో సుమారు 80,000 మంది, కోల్ ఇండియాలో ఐదు లక్షల మంది కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998 ప్రకారం పెన్షన్ పొందుతున్నారు. వీరికి కనీస పెన్షన్ 350 రూపాయలు నిర్ణయించారు.
25 సంవత్సరాలు గడిచినప్పటికీ వీరికి పెన్షన్ పెరుగుదల లేక పోవడం బాధాకరం. గత రెండు నెలల క్రితం కనీస పెన్షన్ 350 రూపాయల నుంచి 1,000 రూపాయలకు పెంచే నిర్ణయం జరిగినప్పటికీ అమలు కావడం లేదు. ఇది కూడా నేటి కాలమాన పరిస్థితులకు సరిపోదు. సింగరేణిలో 1,000 రూపాయలు పెన్షన్ పొందే వారు దాదాపు 20,000 మంది కడు దీన స్థితిలో జీవిస్తున్నారు. కోల్ మైన్స్ స్కీం నిబంధన ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి సమీక్ష జరిపి సవరించాలని నిబంధన అమలు కావడం లేదు. కోల్ మైన్స్ పెన్షన్ పెంచాలని 2019 డిసెంబర్ 19న ఒక రోజు, 2022 జూలై 22 నుంచి 25 వరకు మూడు రోజులు, 2022 డిసెంబర్ 5న ఒక రోజు, న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 27 మార్చి 2023న ప్రధాన మంత్రి పార్లమెంట్ నియోజక వర్గం వారణాసి లో ధర్నా, నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 100 మంది పార్లమెంట్ సభ్యులకు, ప్రధానమంత్రి, వివిధ కేంద్ర శాఖల మంత్రులకు పెన్షన్ పెంపుకై వినతి పత్రాలు సమర్పించారు. చట్ట సభల్లో 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించి నూతన చట్టాలు రూపొందించడంలో ఉన్న ఆసక్తి కోల్ మైన్స్ పెన్షన్ స్కీం 1998ను సవరించి కరువు భత్యంతో కూడిన పెన్షన్ పెంచే దిశగా పార్లమెంట్ సభ్యులు ప్రయత్నించకపోవడం అత్యంత బాధాకరం. గతంలో పెన్షన్ ఫండ్ దుర్వినియోగం వలన పెన్షన్ ఫండ్ క్షిణించింది. ఫండ్ బలోపేతం కొరకు ప్రస్తుతం దేశంలో అమ్మకం అయ్యే ప్రతి టన్ను బొగ్గు పై 10 రూపాయలు పెన్షన్ ఫండ్ కు బొగ్గు సంస్థలు జమ చేస్తున్నాయి. పెన్షన్ ఫండ్ బలోపేతం కొరకు కేంద్ర ప్రభుత్వం, బొగ్గు సంస్థల యాజమాన్యాలు ప్రతి టన్ను బొగ్గు అమ్మకాల్లో 5% పెన్షన్ ఫండ్ కు జమ చేస్తే పెన్షన్ ఫండ్ లో లోటు లేకుండా విశ్రాంత కార్మికులకు పెన్షన్ పెంచవచ్చు.
కోల్ మైన్స్ పెన్షన్ పెంచే బాధ్యత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారిదే. కానీ, కొన్ని హక్కులు ప్రమోషన్ పాలసీ కోల్ ఇండియా కన్నా ఎక్కువగా సింగరేణిలో ఉన్నాయి. ఇక్కడ సింగరేణిలో లాభాల వాటా కార్మికులకు ప్రతి సంవత్సరం చెల్లిస్తూ, ఈ సంవత్సరం 32 శాతం అనగా దాదాపు 700 కోట్ల రూపాయలు కార్మికులకు చెల్లించారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లాభాల్లో కార్మికులకు వాటా చెల్లింపు లేదు. ఇది సింగరేణి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కు. కోల్ ఇండియాలో లాభాల వాటా కార్మికులకు ఇవ్వడం లేదు. ఉచిత కరెంట్ సింగరేణి ఉద్యోగులకు సంస్థ ఇస్తుంది. కోల్ ఇండియాలో ఈ సౌకర్యం లేదు. అలాగే క్వాటర్స్ నందు ఏసీ సౌకర్యం సింగరేణిలో ఉంది. కోల్ ఇండియాలో లేదు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51%, కేంద్ర ప్రభుత్వ వాటా 49% ఉంది. రాజకీయ పార్టీలు విశ్రాంత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజి ద్వారా రిటైర్డ్ బొగ్గు కార్మికులకు సౌకర్యాలు కల్పించవచ్చు.
బొగ్గు విశ్రాంత కార్మిక కుటుంబాలకు ఎటువంటి సంక్షేమ పథకాలు వర్తింపు లేదు. వయోభారం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్డ్ మెడికేర్ స్కీం (సిపిఆర్ఎంఎస్) మెడికల్ కార్డు తీసుకొని ఒప్పంద ఆసుపత్రులకు వెళ్లితే అక్కడ తిరస్కరిస్తున్నారు. నేటి ధరలకు అనుగుణంగా కరువు భత్యంతో కూడిన పెన్షన్ లేకపోవడంతో వీరు పేదరికంలో జీవిస్తున్నన్నప్పటికీ పేద తరగతి ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదు. ఎన్నికల సీజన్ లో ప్రతి రాజకీయ పార్టీ నాయకులు బొగ్గు గనుల ప్రైవేటీకరణ, ఆదాయ పన్ను రద్దు, జనాకర్షణ గ్యారెంటీ స్కీమ్ ల హామీల వర్షం కురిపిస్తున్నారు. మరి బొగ్గు వెలికి తీసి జాతికి వెలుగు నిచ్చిన బొగ్గు విశ్రాంత కార్మికుల బాగోగులు గురించి పలకరించే వారు కరువయ్యారు. బొగ్గు విశ్రాంత కార్మికులకు కరువు భత్యంతో కూడిన పెన్షన్ పెంపు, ఉచిత అపరిమిత వైద్య సేవలు అందించాలని రాజకీయ పార్టీలను వేడుకుంటున్నారు.


✍ ఆళవందార్ వేణు మాధవ్,
📱 8686051752,📍హైదరాబాద్.

AD 01

Follow Me

images (40)
images (40)

బొగ్గు విశ్రాంత కార్మికులను ఆదుకోండి

 

గాలి, వెలుతురు సరిగ్గా లేని చీకటి బొగ్గు గనుల్లో 30 నుంచి 40 సంవత్సరాలు తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడ్డ బొగ్గు గని విశ్రాంత కార్మికులు దేశ వ్యాప్తంగా ముఖ్యంగా బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర దక్షిణ భారత దేశంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో నివసిస్తున్నారు. సింగరేణిలో సుమారు 80,000 మంది, కోల్ ఇండియాలో ఐదు లక్షల మంది కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998 ప్రకారం పెన్షన్ పొందుతున్నారు. వీరికి కనీస పెన్షన్ 350 రూపాయలు నిర్ణయించారు.
25 సంవత్సరాలు గడిచినప్పటికీ వీరికి పెన్షన్ పెరుగుదల లేక పోవడం బాధాకరం. గత రెండు నెలల క్రితం కనీస పెన్షన్ 350 రూపాయల నుంచి 1,000 రూపాయలకు పెంచే నిర్ణయం జరిగినప్పటికీ అమలు కావడం లేదు. ఇది కూడా నేటి కాలమాన పరిస్థితులకు సరిపోదు. సింగరేణిలో 1,000 రూపాయలు పెన్షన్ పొందే వారు దాదాపు 20,000 మంది కడు దీన స్థితిలో జీవిస్తున్నారు. కోల్ మైన్స్ స్కీం నిబంధన ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి సమీక్ష జరిపి సవరించాలని నిబంధన అమలు కావడం లేదు. కోల్ మైన్స్ పెన్షన్ పెంచాలని 2019 డిసెంబర్ 19న ఒక రోజు, 2022 జూలై 22 నుంచి 25 వరకు మూడు రోజులు, 2022 డిసెంబర్ 5న ఒక రోజు, న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 27 మార్చి 2023న ప్రధాన మంత్రి పార్లమెంట్ నియోజక వర్గం వారణాసి లో ధర్నా, నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 100 మంది పార్లమెంట్ సభ్యులకు, ప్రధానమంత్రి, వివిధ కేంద్ర శాఖల మంత్రులకు పెన్షన్ పెంపుకై వినతి పత్రాలు సమర్పించారు. చట్ట సభల్లో 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించి నూతన చట్టాలు రూపొందించడంలో ఉన్న ఆసక్తి కోల్ మైన్స్ పెన్షన్ స్కీం 1998ను సవరించి కరువు భత్యంతో కూడిన పెన్షన్ పెంచే దిశగా పార్లమెంట్ సభ్యులు ప్రయత్నించకపోవడం అత్యంత బాధాకరం. గతంలో పెన్షన్ ఫండ్ దుర్వినియోగం వలన పెన్షన్ ఫండ్ క్షిణించింది. ఫండ్ బలోపేతం కొరకు ప్రస్తుతం దేశంలో అమ్మకం అయ్యే ప్రతి టన్ను బొగ్గు పై 10 రూపాయలు పెన్షన్ ఫండ్ కు బొగ్గు సంస్థలు జమ చేస్తున్నాయి. పెన్షన్ ఫండ్ బలోపేతం కొరకు కేంద్ర ప్రభుత్వం, బొగ్గు సంస్థల యాజమాన్యాలు ప్రతి టన్ను బొగ్గు అమ్మకాల్లో 5% పెన్షన్ ఫండ్ కు జమ చేస్తే పెన్షన్ ఫండ్ లో లోటు లేకుండా విశ్రాంత కార్మికులకు పెన్షన్ పెంచవచ్చు.
కోల్ మైన్స్ పెన్షన్ పెంచే బాధ్యత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారిదే. కానీ, కొన్ని హక్కులు ప్రమోషన్ పాలసీ కోల్ ఇండియా కన్నా ఎక్కువగా సింగరేణిలో ఉన్నాయి. ఇక్కడ సింగరేణిలో లాభాల వాటా కార్మికులకు ప్రతి సంవత్సరం చెల్లిస్తూ, ఈ సంవత్సరం 32 శాతం అనగా దాదాపు 700 కోట్ల రూపాయలు కార్మికులకు చెల్లించారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లాభాల్లో కార్మికులకు వాటా చెల్లింపు లేదు. ఇది సింగరేణి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కు. కోల్ ఇండియాలో లాభాల వాటా కార్మికులకు ఇవ్వడం లేదు. ఉచిత కరెంట్ సింగరేణి ఉద్యోగులకు సంస్థ ఇస్తుంది. కోల్ ఇండియాలో ఈ సౌకర్యం లేదు. అలాగే క్వాటర్స్ నందు ఏసీ సౌకర్యం సింగరేణిలో ఉంది. కోల్ ఇండియాలో లేదు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51%, కేంద్ర ప్రభుత్వ వాటా 49% ఉంది. రాజకీయ పార్టీలు విశ్రాంత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజి ద్వారా రిటైర్డ్ బొగ్గు కార్మికులకు సౌకర్యాలు కల్పించవచ్చు.
బొగ్గు విశ్రాంత కార్మిక కుటుంబాలకు ఎటువంటి సంక్షేమ పథకాలు వర్తింపు లేదు. వయోభారం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్డ్ మెడికేర్ స్కీం (సిపిఆర్ఎంఎస్) మెడికల్ కార్డు తీసుకొని ఒప్పంద ఆసుపత్రులకు వెళ్లితే అక్కడ తిరస్కరిస్తున్నారు. నేటి ధరలకు అనుగుణంగా కరువు భత్యంతో కూడిన పెన్షన్ లేకపోవడంతో వీరు పేదరికంలో జీవిస్తున్నన్నప్పటికీ పేద తరగతి ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదు. ఎన్నికల సీజన్ లో ప్రతి రాజకీయ పార్టీ నాయకులు బొగ్గు గనుల ప్రైవేటీకరణ, ఆదాయ పన్ను రద్దు, జనాకర్షణ గ్యారెంటీ స్కీమ్ ల హామీల వర్షం కురిపిస్తున్నారు. మరి బొగ్గు వెలికి తీసి జాతికి వెలుగు నిచ్చిన బొగ్గు విశ్రాంత కార్మికుల బాగోగులు గురించి పలకరించే వారు కరువయ్యారు. బొగ్గు విశ్రాంత కార్మికులకు కరువు భత్యంతో కూడిన పెన్షన్ పెంపు, ఉచిత అపరిమిత వైద్య సేవలు అందించాలని రాజకీయ పార్టీలను వేడుకుంటున్నారు.


✍ ఆళవందార్ వేణు మాధవ్,
📱 8686051752,📍హైదరాబాద్.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment