ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-న్యూటెక్ గనిలో పని చేస్తూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఆర్.ధనంజయ, జె. కొమురయ్యలను గని ఎస్ఓఎం ఇ. స్వామిరాజు బుధవారం ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్కే-న్యూటెక్ గని ఎస్ఓఎం మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉద్యోగులు కంపెనీకి చేసిన సేవలను కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం తదుపరి జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గని రక్షణాధికారి కొట్టె రమేష్, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, సంక్షేమాధికారి పాల్ సృజన్, ఫిట్ ఇంజనీర్ రాజగోపాల చారి, ఇంజనీర్ కృష్ణ, సర్వే అధికారి పిచ్చేశ్వర్ రావు, వెంటిలేషన్ అధికారి చంద్రమౌళి, అండర్ మేనేజర్లు మిట్లపల్లి శ్రీనివాస్, సాత్విక్, పరమేశ్వర్, ఏఐటీయూసీ నాయకులు సంపత్, గజ్జి రమేష్, మల్లేష్, జంపయ్య, సంపత్ రావు, సకినాల నర్సయ్య, అక్రం పాషా, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
218