ఆర్.కె న్యూస్, మంచిర్యాల: ప్రభుత్వ ఆర్.బి.ఎస్.కె ఆధ్వర్యంలో సోమవారం కోటపల్లి మండలంలోని పారుపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు కోటపల్లి మండల ఆర్.బి.ఎస్.కె వైద్యులు డాక్టర్ వి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో హిమోగ్లోబిన్ స్థాయి పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ పోషకాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని, తద్వారా జ్ఞాపకశక్తి పెంచుకొని ఉత్తమ విద్యను పొందే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు టి.పావని, బధావత్ బిక్కు, బి నర్సింగ్, పి. వాణిశ్రీ, సంతోష్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
204