ఆర్.కె న్యూస్, నస్పూర్: ఈనెల 18న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నస్పూర్ పట్టణంలోని మనోరంజన్ సముదాయంలో డాక్టర్ విశ్వనాథ మహర్షి ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని శ్రీరాంపూర్ ఏరియా డీజీఎం (పర్సనల్) పి అరవింద రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, నడుము నొప్పులకు పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని కోరారు.
200