ఆర్.కె న్యూస్, మందమర్రి: మందమర్రి ఏరియా నూతన జీఎంగా బాధ్యతలు స్వీకరించిన జి. దేవేందర్ ను ఏరియా డబ్ల్యూ.పి.ఎస్ అండ్ జి.ఏ క్రీడాకారులు, కళాకారులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జీఎంను శాలువాతో సన్మానించి మొక్కను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్, క్రీడల గౌరవ కార్యదర్శి కార్తీక్, క్రీడల సమన్వయకర్త రవికుమార్, జనరల్ కెప్టెన్ టి. చిన్నయ్య, క్రీడల కెప్టెన్లు ,సీనియర్ క్రీడాకారులు, క్రీడాకారినిలు,కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
142