సెప్టెంబర్ 2న కలెక్టరేట్ ఎదుట ధర్నా

  • సింగరేణి స్థలాల్లోని ఇండ్లకు పట్టాలు ఇవ్వాలి
  • సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్ మేకల దాసు

ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని, అధిక ధరలు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట  ధర్నా నిర్వహిస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, నస్పూర్ మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ మేకల దాసు తెలిపారు. శుక్రవారం శ్రీరాంపూర్ లో మాట్లాడుతూ, నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5,17వ వార్డు లోని హిమ్మత్ నగర్ కొంత భాగం, ఆర్.కె 8 కాలనీ, భగత్ సింగ్ నగర్, సుందరయ్య నగర్, కృష్ణ కాలని ప్రాంత వాసులకు సింగరేణి స్థలాన్ని రెవెన్యూకు అప్పగించి జీవో నెంబర్ 76 ద్వారా ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని సంవత్సరాల నుండి సింగరేణి స్థలాల్లో  ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని, అధిక ధరలు నియంత్రించాలనే డిమాండ్లతో సెప్టెంబర్ 2న ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ శ్రీరాంపూర్ కార్యదర్శి పూజారి రామన్న, సహాయ కార్యదర్శి కొత్తపల్లి మహేష్, జక్క మొగిలి, సర్వ శ్రీనివాస్, తోట రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

సెప్టెంబర్ 2న కలెక్టరేట్ ఎదుట ధర్నా

  • సింగరేణి స్థలాల్లోని ఇండ్లకు పట్టాలు ఇవ్వాలి
  • సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్ మేకల దాసు

ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని, అధిక ధరలు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట  ధర్నా నిర్వహిస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, నస్పూర్ మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ మేకల దాసు తెలిపారు. శుక్రవారం శ్రీరాంపూర్ లో మాట్లాడుతూ, నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5,17వ వార్డు లోని హిమ్మత్ నగర్ కొంత భాగం, ఆర్.కె 8 కాలనీ, భగత్ సింగ్ నగర్, సుందరయ్య నగర్, కృష్ణ కాలని ప్రాంత వాసులకు సింగరేణి స్థలాన్ని రెవెన్యూకు అప్పగించి జీవో నెంబర్ 76 ద్వారా ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని సంవత్సరాల నుండి సింగరేణి స్థలాల్లో  ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని, అధిక ధరలు నియంత్రించాలనే డిమాండ్లతో సెప్టెంబర్ 2న ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ శ్రీరాంపూర్ కార్యదర్శి పూజారి రామన్న, సహాయ కార్యదర్శి కొత్తపల్లి మహేష్, జక్క మొగిలి, సర్వ శ్రీనివాస్, తోట రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment