- ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ రాముడు
- ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు అందజేత
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఉద్యోగులు రక్షణ నియమాలు పాటిస్తూ, నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ రాముడు అన్నారు. సోమవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 7 గనిలో ఆగస్టు నెలలో ఎక్కువ టబ్బులు నింపిన ఎస్.డి.ఎల్ ఆపరేటర్లు పల్లెర్ల తిరుపతి, మారేపల్లి సారయ్యలకు ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ రాముడు, గని మేనేజర్ తిరుపతి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ రాముడు మాట్లాడుతూ ఆర్.కె 7 గని ఎస్.డి.ఎల్ ఆపరేటర్లు ఉత్పత్తి కోసం కృషి చేయడం అభినందనీయమని, ఉత్పత్తి సాధనలో ప్రతి ఒక్క ఉద్యోగి కృషి ఉందని అన్నారు. అనంతరం గని మేనేజర్ తిరుపతి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆర్.కె 7 గనికి ఉత్పత్తి, రక్షణలో మంచి పేరు తీసుకురావాలని, ఇందుకు ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గని రక్షణ అధికారి సంతోష్ రావు, ఏఐటీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కొట్టె కిషన్ రావు, అండర్ మేనేజర్ రవీందర్, ఇంజనీర్లు ప్రవీణ్, రమేష్, వెంటిలేషన్ ఆఫీసర్ జగదీష్, సంక్షేమ అధికారి సంతన్, గుర్తింపు సంఘం నాయకులు ఏరియా సెక్రటరీ మారేపల్లి సారయ్య, పిట్ సెక్రటరీ బేర రవీందర్, ఇతర అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.