ఆర్.కె న్యూస్, నస్పూర్: ఉద్యోగులు క్రమం తప్పకుండా విధులు నిర్వర్తించాలని శ్రీరాంపూర్ ఓసీపీ గని మేనేజర్ బి. బ్రహ్మాజీ రావు అన్నారు. గైర్హాజరు ఉద్యోగులకు సోమవారం గని గని మేనేజర్ బి. బ్రహ్మాజీ రావు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఓసీపీ గని మేనేజర్ మాట్లాడుతూ అనవసరంగా విధులకు గైర్హాజరు అయ్యే ఉద్యోగులను ఉపేక్షించేది లేదని, విధులకు సక్రమంగా హాజరు కాకపోతే కంపెనీ సర్వీస్ నుంచి తొలగించబడుతారని అన్నారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చికిత్స తీసుకోవాలని, క్రమం తప్పకుండా అవసరమైన మందులు వాడుతూ విధులకు హాజరవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్పీ ఓసిపి పిట్ సెక్రటరీ మోతే లచ్చన్న, సంక్షేమ అధికారి బి.శంకర్, ఉత్తమ ఉద్యోగి గొట్టేముక్కల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
119