- ఆర్.కె 7 గని ఇంచార్జి మేనేజర్ సంతోష్ రావు
- పదోన్నతి పత్రాలు అందజేత
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత సాధిస్తూ సింగరేణి సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని ఆర్.కె 7 గని ఇంచార్జి మేనేజర్ సంతోష్ రావు అన్నారు. సోమవారం ఆర్.కె 7 గని ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాటగిరి ప్రమోషన్ పొందిన 34 మంది ఉద్యోగులకు గని ఇంచార్జి మేనేజర్ సంతోష్ రావు పదోన్నతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్.కె 7 గని ఇంచార్జి మేనేజర్ మాట్లాడుతూ, పదోన్నతితో పాటు ఉద్యోగులపై బాధ్యత పెరుగుతుందని అన్నారు. పని స్థలాల్లో విధిగా రక్షణ సూత్రాలు పాటించాలని కోరారు. ఉద్యోగులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో సంస్థ ముందుంటుందని అన్నారు. అనంతరం ఏఐటీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కొట్టె కిషన్ రావు మాట్లాడుతూ, సింగరేణిలో పనిచేయడం గొప్ప అవకాశంగా భావించాలని, ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో భాగంగా సింగరేణి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంటిలేషన్ ఆఫీసర్ జగదీష్ రావు, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ మారపల్లి సారయ్య, అండర్ మేనేజర్లు రవీందర్, శశాంక్, ఇంజనీర్లు ప్రవీణ్, రమేష్, సంక్షేమ అధికారి సంతన్ తదితరులు పాల్గొన్నారు.