నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా రగ్బీ జట్టును అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని కెజిఎ డిఫెన్స్ అకాడమీ గ్రౌండ్ లో అండర్ 15 బాల బాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ, రగ్బీ క్రీడను అన్ని మండలాల్లో అభివృద్ధి చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించే విధంగా శిక్షణ శిబిరలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించి మంచిర్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కెజిఎ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ కుమార్, కోచ్ రమేష్, పీఈటి లు దేవేందర్, వెంకటేష్, సురేష్, ధరణ్, నరసింహులు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
103