- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో భయాందోళనలకు గురి కాకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ అన్నారు. బుధవారం సిసిసి సింగరేణి ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమానికి శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు హాల్ టికెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పరుచుకొని, లక్ష్య సాధనకు నిరంతర కృషి చేయాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం సమకూర్చిన పరీక్ష సామాగ్రిని జీఎం పదో తరగతి విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఏ. రాజేశ్వర్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఆర్. విష్ణువర్ధన్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సంతోష్, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.