సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక పథకం

  • మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

నస్పూర్, ఏప్రిల్ 01 (ఆర్.కె న్యూస్):దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక పథకం అని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. మంగళవారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పాత మంచిర్యాల రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద ఇంటికి సన్నబియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకమని, పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచన, పేదవారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, పాత మంచిర్యాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక పథకం

  • మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

నస్పూర్, ఏప్రిల్ 01 (ఆర్.కె న్యూస్):దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక పథకం అని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. మంగళవారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పాత మంచిర్యాల రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద ఇంటికి సన్నబియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకమని, పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచన, పేదవారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, పాత మంచిర్యాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment