- సీపీ, డీసీపీలకు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు
బెల్లంపల్లి, ఆర్.కె న్యూస్: బెల్లంపల్లి పట్టణంలో చలామణి అవుతున్న నకిలీ విలేకరుల పై మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల డీసీపీ లకు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు ఫిర్యాదు చేశారు. బెల్లంపల్లి పట్టణంలో రిజిస్టర్ ప్రెస్ క్లబ్ ఉండగా మరో ప్రెస్ క్లబ్ ను చలామణి చేస్తూ కొందరు వ్యక్తులు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇందుకు స్పందించిన సీపీ, డీసీపీ లు నకిలీ విలేకరుల పై విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. విలేకరుల పేరుతో ఎవరైనా అక్రమ వసూళ్ల కు పాల్పడితే వారిని గుర్తించి ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని అట్టి వారిపై తగు చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.