నస్పూర్, ఆర్.కె న్యూస్: ఇటీవల శ్రీరాంపూర్ డీజీఎం (పర్సనల్)గా బాధ్యతలు స్వీకరించిన ఎస్. అనిల్ కుమార్ ను బుధవారం శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్ రావు ఆధ్వర్యంలో ఐ.ఎన్.టి.యు.సి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎన్.టి.యు.సి సెంట్రల్ నాయకులు గరిగ స్వామి, తిరుపతి రాజు, ఏనుగు రవీందర్ రెడ్డి, జీవన్ జోయల్, మారేపల్లి బాబు, మెండె వెంకటి, ఏరియా నాయకులు ప్రసాద్, రౌతు సత్యనారాయణ, పి.వెంకటేశ్వర్లు, పూనెం రామకృష్ణ, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
45