సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమారాణి
వైభవంగా దీపాలంకరణ పోటీలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మహిళల భాగస్వామ్యంతోనే వేడుకలకు నిండుదనం చేకూరుతుందని శ్రీరాంపూర్ ఏరియా సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమారాణి అన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోమవారం నస్పూర్ కాలనీలోని మనోరంజన్ సముదాయిలో మహిళలకు దీపాలంకరణ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీరాంపూర్ ఏరియా సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమరాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలు పాల్గొనే ఏ కార్యక్రమమైనా తప్పక విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. శ్రీరాంపూర్ పరిసర ప్రాంతాల నుండి మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. నిత్యం ఇంటి పనుల్లో బిజీగా ఉండే మహిళలు, సమయం కేటాయించి ఇలాంటి పోటీల్లో తమ ప్రతిభను చాటుకోవడం అభినందనీయమని కొనియాడారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల 23న సాయంత్రం శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో జరిగే సింగరేణి దినోత్సవ ప్రధాన వేడుకలలో బహుమతులు అందజేస్తామని ఉమారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మోత్కూరి కొమురయ్య, అకౌంట్స్ అధికారి పద్మ, సీనియర్ పర్సనల్ ఆఫీసర్లు ఎస్. సురేందర్, మురళి, ఏఐటీయూసీ నాయకులు కొట్టే కిషన్ రావు, సుజాత, శ్రీలత, సేవా సెక్రటరీ జ్యోతి, సేవా సభ్యురాళ్లు శారద, సునీత, రజిత, శిక్షకురాళ్లు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.





