18న నస్పూర్ డిస్పెన్సరీలో వెల్ బేబీ షో

నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 18వ తేదీన నస్పూర్ డిస్పెన్సరీలో వెల్ బేబీ షోనిర్వహించనున్నట్లు శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేస్తున్న సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఈ పోటీలకు అర్హులని తెలిపారు. కేవలం 1 నుండి 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. పోటీలలో పాల్గొనే ఉద్యోగులు తప్పనిసరిగా తమ ఐడి కార్డు, పిల్లల జనన ధృవీకరణ పత్రం, రోగ నిరోధక టీకాల కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. అర్హులైన ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

AD 01

Follow Me

images (40)
images (40)

18న నస్పూర్ డిస్పెన్సరీలో వెల్ బేబీ షో

నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 18వ తేదీన నస్పూర్ డిస్పెన్సరీలో వెల్ బేబీ షోనిర్వహించనున్నట్లు శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేస్తున్న సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఈ పోటీలకు అర్హులని తెలిపారు. కేవలం 1 నుండి 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. పోటీలలో పాల్గొనే ఉద్యోగులు తప్పనిసరిగా తమ ఐడి కార్డు, పిల్లల జనన ధృవీకరణ పత్రం, రోగ నిరోధక టీకాల కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. అర్హులైన ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment