మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై శనివారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్ తాళ్లపల్లికి చెందిన బీఆర్ఎస్ మాజీ వార్డు సభ్యుడు బొడ్డు తిరుపతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గ పురోగతి కోసం శ్రమిస్తున్న నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న మార్పులను చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని ఈ సందర్భంగా సురేఖ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నూకల రమేష్ పాల్గొన్నారు.
17







