ఆర్.కె న్యూస్, నస్పూర్: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు సోమవారం శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏరియా వైస్ ప్రెసిడెంట్ నీలబోయిన కుమార్, ఏరియా లైజర్ ఆఫీసర్ కిరణ్ కుమార్, డీజీఎం (ఐఈడి) చిరంజీవులు, ఏరియా కార్యదర్శి సదిరం రాజేంద్రప్రసాద్, పిఓ బాపయ్య, నవీన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలుపొందిన ఏఐటియుసి నాయకులు సోమవారం శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, బ్రాంచ్ ఉపాధ్యక్షులు కొట్టె కిషన్ రావు, బ్రాంచ్ సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, నాయకులు మురళి చౌదరి, నర్సింగ రావు, అఫ్రోజ్ ఖాన్, గండి సతీష్ గొల్లపల్లి రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
– ప్రమాద రహిత ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి
– గని మేనేజర్ ఈ. తిరుపతి
ఆర్.కె న్యూస్, నస్పూర్
సింగరేణి వ్యాప్తంగా ఉత్పత్తి, రక్షణలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే6 గని రారాజుగా ముందుకు సాగుతుందని గని మేనేజర్ ఈ. తిరుపతి తెలిపారు. శనివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రక్షణ వారోత్సవాలు, ఎస్.డి.ఎల్ టెక్నాలజీలో సింగరేణి వ్యాప్తంగా మొదటి బహుమతి, సింగరేణి ఆవిర్భావ వేడుకలలో ఉత్తమ అధికారి, ఉద్యోగి విభాగాల్లో ఆర్కే6 గనికి బహుమతులు రావడం హర్షణీయమన్నారు. ఆర్కే6 గని కోల్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా వారిచే 4 స్టార్ రేటింగ్ పొందిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 110 శాతంతో ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఉత్పత్తిలో ఆర్కే6 గని సింగరేణి వ్యాప్తంగా ముందు వరుసలో ఉంటుందన్నారు. శ్రీరాంపూర్ ఏరియా జీఎం సంజీవ రెడ్డి, ఏజెంట్ ఏవి రెడ్డిల సహకారం, గని కార్మికులు, కార్మిక సంఘాల నాయకుల సహకారంతో ప్రమాద రహిత ఉత్పత్తి సాధిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. 2023వ సంవత్సరం తమకు అన్ని విధాల తీపి జ్ఞాపకాలు మిగిల్చిందని తెలిపారు. ఉద్యోగులు ప్రమాద రహిత ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని, యువ ఉద్యోగులు గైర్హాజరు లేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. పని స్థలాల్లో విధిగా రక్షణ పరికరాలు, రక్షణ సూత్రాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ కాదాసి శ్రీనివాస్, డిప్యూటీ మేనేజర్ కొమురయ్య, ఫిట్ ఇంజనీర్ ఏ. శ్యామ్ కుమార్, సెక్షన్ ఇంజనీర్ ఆర్. మహేష్, అండర్ మేనేజర్లు శ్రీనివాస్, రంజిత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
– ఐఎన్టియుసిని భారీ మెజార్టీతో గెలిపించాలి
– మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఆర్.కె న్యూస్, నస్పూర్
సింగరేణిని కాపాడే శక్తి, సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, సింగరేణి పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టియుసి భారీ మెజారిటీతో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతిపరులకు ఐఎన్టియుసిలో స్థానం లేదని స్పష్టం చేశారు. హక్కుల సాధన కోసం గుర్తింపు సంఘం ఎన్నికల్లో గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్మికవర్గాన్ని కోరారు. శ్రీరాంపూర్ ఏరియాలోని కార్మికుల బాధ్యత తాను తీసుకుంటానని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. గత పాలకులు డి.ఎం.ఎఫ్.టి నిధులను ఇతర ప్రాంతాలకు తరలించి దుర్వినియోగం చేశారన్నారు. ప్రస్తుతం సింగరేణి సంస్థలో యువ కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, విద్యావంతులైన యువ కార్మికులు తమ హక్కులు సాధించే ఐఎన్టియుసిని ఎన్నుకోవాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన స్థానిక ప్రజలు, సింగరేణి కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తుందన్నారు. ప్రతినెల 2వ, 4వ ఆదివారం సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికుల కోసం సమయం కేటాయిస్తానని తెలిపారు. సింగరేణి కార్మికులకు 250 గజాల ఇంటి స్థలం, 20 లక్షల వడ్డీలేని రుణాలు ఇప్పించడానికి, నస్పూర్ లో సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి నాయకులు జెట్టి శంకర్ రావు, కలవేన శ్యామ్, తిరుపతి రాజు, భీం రవి, కాంగ్రెస్ నాయకులు తూముల నరేష్, పూదరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం నస్పూర్ పట్టణ సమితి ఆధ్వర్యంలో షిర్కే సెంటర్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, నస్పూర్ కాలనీ శాఖలో సిపిఐ పట్టణ కార్యదర్శి రాజేశ్వరరావు, నాగార్జున కాలనీ శాఖలో సీనియర్ నాయకులు కంచం పోషంలు పార్టీ జెండా ఆవిష్కరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ మాట్లాడుతూ ఈనెల 20 నుండి 26 వరకు జరుగనున్న సిపిఐ 99వ ఆవిర్భావ వేడుకలు పట్టణ, మండల, గ్రామ స్థాయిలో అరుణ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో సిపిఐ ఆవిర్భవించిందని, పార్టీ ఆవిర్భావం నుండి దున్నే వారికి భూమి కావాలని పోరాటాలు చేసిందని, నేటి వరకు బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజలు, కార్మికులు, కర్షకుల సమస్యల పై ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ, ప్రజా సంఘాలు, కార్మికులు, కర్షకులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, మండల సహయ కార్యదర్శి లింగం రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, జిల్లా సమితి సభ్యులు మోత్కూరి కొమురయ్య, కోడి వెంకటేశం, దొడ్డిపట్ల రవిందర్, తంగళ్ళపల్లి సురేష్, అల్ల లచ్చి రెడ్డి, దాడి రాజయ్య, జడల శ్రీనివాస్, డీకొండ మల్లయ్య, రషీద్, రావుల రాజయ్య, గద్దె నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
– సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్
ఆర్.కె న్యూస్, నస్పూర్
సింగరేణిలో నిజాయితీగా పనిచేసే యూనియన్ రావాలని, అందుకే మార్పు రావాలని, సిఐటియు గెలవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే5, ఎస్సార్పీ 3 గనులపై జరిగిన గేట్ మీటింగ్ లలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ, కార్మికుల ఓట్లతో గెలిచి నిజాయితీగా పనిచేయాల్సిన సంఘాలు ప్రతి పనికి రేటు కట్టి కార్మికులను ఇబ్బందులకు గురి చేశాయని, నిజాయితీగా పనిచేసే సిఐటియును గెలిపించాలని కోరారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, రఘునందన్ రావు లాంటి వారిని హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమల్లో ఓడించామని, సింగరేణిలో సైతం అవినీతి అంతం చేయడానికి సిఐటియు ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మెడికల్ బోర్డులలో, ప్రమోషన్లలో అవినీతి జరుగుతుందని, కార్మికుడు పదవీ విరమణ పొందిన తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ సైతం ఇవ్వడానికి అనేక ఇబ్బందులు పడుతున్న తీరును కార్మికులు గమనించాలని, ప్రతి కార్మికుడు తన జీతంలో నుండి మూడు నాలుగు నెలలు టాక్స్ కడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను పట్టించుకోకుండా చివరకు దాచుకున్న పట్టు పైసలు సైతం టాక్స్ వేసేలా చట్టాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అధిక శాతం వాటాదారుగా ఉన్న సింగరేణి భూగర్భ గనుల అనుమతులు తెచ్చుకోవడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వం ఏదైనా కార్మికులకు వ్యతిరేకమే అని, ప్రభుత్వ అనుబంధ సంఘాలతో కార్మికులకు ఒరిగేదేమీ లేదని, ఇన్ని రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వ అనుబంధ సంఘం టీబీజీకేఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయుసీ వచ్చిన రేపు అదే జరుగుతుందని కార్మికులు గమనించాలని కోరారు. ఏఐటీయూసీ గెలిచిన ఏరియాలో ఒక తీరు, ఓడిన ఏరియాలో ఒక తీరు ఆందోళన చేస్తున్న విషయాన్ని గమనించాలని, స్థానిక సమస్యల పైన సిఐటియు చేస్తున్న పోరాటాలను గమనిస్తున్న కార్మికులు ఈసారి పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి, దుంపల రంజిత్ కుమార్, డివిజన్ కార్యదర్శి గోదారి భాగ్యరాజ్, బ్రాంచ్ అధ్యక్షులు బాలాజీ, ఆర్గనైజర్ వెంగళ శ్రీనివాస్, అజయ్, సాయిల శ్రీనివాస్, సదానందం, మిడివెల్లి శ్రీనివాస్, నరేష్, రవీందర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్
సింగరేణి కార్మికుల హక్కులను ఐఎన్టీయూసీ మాత్రమే సాధిస్తుందని ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు కలవేన శ్యామ్ లు తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ3 గనిపై జరిగిన గేట్ మీటింగ్ లో వారు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఘన విజయాన్ని అందించి, ప్రభుత్వ ఏర్పాటులో సింగరేణి కార్మిక వర్గం భాగస్వామ్యం అయినట్టే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గడియారం గుర్తుకు ఓటేసి ఐఎన్టీయూసీ ని గెలిపించాలని, ఐఎన్టీయూసీని గెలిపిస్తేనే సింగరేణి సంస్థకు మనుగడ ఉంటుందని, లేనిపక్షంలో కార్పొరేట్ పెట్టుబడిదారులకు నిలయంగా మారుతుందని తెలిపారు. సింగరేణిలో ఉన్న అన్ని విభాగాల ఉద్యోగులు, కార్మికులకు రావాల్సిన హక్కులు సాధిస్తామని, భవిష్యత్తులో నూతన ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని, యజమాన్యం సకాలంలో కార్మికులకు స్వేటర్లు, బూట్లు, సాక్సులు నాణ్యమైన పనిముట్లు అందించడం లేదని, పని స్థలాల్లో రక్షణ చర్యలు కరువయ్యాయని, యాజమాన్యం రక్షణ చర్యలు మీద దృష్టి పెట్టాలని, ప్రశ్నించే కార్మిక సంఘం నాయకులు కరువయ్యారని, పైరవీలు లంచాలకు అలవాటు పడిన అధికారులు, నాయకులు ఉన్నారని, వీటన్నింటికి స్వస్తి పలకాలన్నా, యజమాన్యం నిరంకుశ విధానాలను తిప్పి కొట్టాలన్న ఒక్క ఐఎన్టీయూసితోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గరిగె స్వామి, సమ్ము రాజన్న, రాఘవ రెడ్డి, శీలం చిన్నయ్య, నర్సింగ్, మనోజ్, సమ్మిరెడ్డి, మహేష్, చంద్రమోహన్, వెంకటస్వామి, సుధాకర్, శ్రీనివాస్, వీరమల్లు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్రిష్ణ కాలనీ గీత ప్రశాంతి నిలయంలో నిర్వహిస్తున్న గీతా జయంతి, శ్రీమద్భగవద్గీత సత్సంగం రజతోత్సవ వేడుకలకు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సత్సంగ అధ్యక్షులు భక్త రాజేశం గురూజీ తెలిపారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 13 నుండి 23 వరకు నిర్వహిస్తున్న వేడుకలలో శ్రీహరి మౌనస్వామి, విష్ణు సేవా నందగిరి స్వాములు వస్తున్నారని, అనేక ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకుంటూ, పూజలు, యజ్ఞములతో పాటు అనేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కోలాట, భజనలతో శోభాయాత్ర ఉంటుందన్నారు. పాఠశాల విద్యార్థులచే భగవద్గీత పారాయణం ఉంటుందన్నారు. భగవద్గీతను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, భగవద్గీతను అధ్యనం చేయడం ద్వారా ఆధ్యాత్మిక తత్వం పెంపొందుతుందన్నారు. మంచి పనులు చేస్తూ, శాంతి, భక్తి మార్గంలో జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో మారపెల్లి సారయ్య, డిడి ప్రసాద్, లక్ష్మీనారాయణ, సాంబారి రాజేశం, రాంబాబు, రాజమౌళి, రాజేశ్వరి, స్వర్ణ, లక్ష్మి, సత్యవతి, రమదేవి, అనసూయ తదితరులు పాల్గొన్నారు.
– కార్మికుల సొంత ఇంటి పథకం అమలుకు కృషి
– గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించాలి
– ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
– ఏఐటీయూసీలో చేరికలు
ఆర్.కె న్యూస్, నస్పూర్
సింగరేణి కార్మికుల హక్కుల సాధన ఏఐటీయూసీతోనే సాధ్యమని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్, ఎస్సార్సీ 1 గనుల పై నిర్వహించిన ద్వార సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ ఈనెల 27న జరుగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగి, కార్మిక వర్గ హక్కులు, సౌకర్యాలే ధ్యేయంగా పని చేస్తున్న ఏఐటీయూసీని నక్షత్రం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మికులను కోరారు. రాబోయే ఎన్నికల్లో ఐటీయూసీని గుర్తింపు సంఘంగా గెలిపిస్తే కోల్ ఇండియా మాదిరిగా అలవెన్స్ లపై పడే టాక్స్ సింగరేణి కార్మికులకు ఇప్పిస్తామన్నారు. ప్రతి కార్మికునికి 200 గజాల భూమి, 20 లక్షలు వడ్డీ లేని రుణాలు యాజమాన్యంతో ఇప్పిస్తామన్నారు. సింగరేణి పాఠశాలల్లో సీబీఎస్ఈ విద్యను అమలు చేయిస్తామన్నారు. నిర్మాణ లేమితో ఉన్న కొన్ని జాతీయ సంఘాలు, ప్రాంతీయ సంఘాలు బలమైన కార్మిక ఉద్యమాలను చేయలేవని అన్నారు. విజ్ఞులైన సింగరేణి ఉద్యోగులు బాగా ఆలోచించి, విచ్ఛిన్నకర పాత్ర పోషిస్తున్న పాలకవర్గ ట్రేడ్ యూనియన్లను ,పైరవీకారి ట్రేడ్ యూనియన్లను ఓడించాలని కార్మికులను కోరారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు ఐటీయూసీలో చేరారు. వీరికి వాసిరెడ్డి సీతారామయ్య కండువా కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వీరభద్రయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ, బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కే బాజీ సైదా, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కొమురయ్య, ఆర్కే న్యూ టెక్ పిట్ సెక్రటరీ ఆకుల లక్ష్మణ్, దాడి రాజయ్య, కామెర వేణు, బెల్లంపల్లి రీజియన్ కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్షుడు అప్రోజ్ ఖాన్, హెడ్ ఓవర్ మెన్ లు చంద్రమోహన్, వెంకటేశ్వర్లు, అదే వెంకటేష్, రాజ్ కుమార్, గని కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
– శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి
– ఘనంగా సేవా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఆర్.కె న్యూస్, నస్పూర్
సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా శ్రీరాంపూర్ ఏరియాలోని పలువురు నిరుపేద యువతి, యువకులు వృత్తి శిక్షణ కోర్సులలో శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందారని శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని సీఈఆర్ క్లబ్ లో మంగళవారం సేవా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి మాట్లాడుతూ సింగరేణి సేవా సమితి ద్వారా శ్రీరాంపూర్ ఏరియాలో ఈ సంవత్సరం 473 మంది మహిళలు వివిధ వృత్తి శిక్షణ కోర్సులలో శిక్షణ పొందడం అభినందనీయమని, మహిళలు ముందుకు వస్తే నూతన కోర్సులను ప్రవేశపెట్టడానికి యాజమాన్యం తగిన ప్రణాళికలతో ముందుకు వెళుతుందని తెలిపారు. తదుపరి సేవా అధ్యక్షురాలు రాధాకుమారి మాట్లాడుతూ సేవా డిసెంబర్ 10, 2000వ సంవత్సరంలో ఆవిర్భవించిందని, సేవా ద్వారా శ్రీరాంపూర్ వ్యాప్తంగా అనేక మంది యువతీ, యువకులకు టైలరింగ్, మగ్గం, బ్యూటీషియన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ డ్రైవింగ్, హెవీ డ్రైవింగ్, వోల్వా డ్రైవింగ్ కోర్సులలో శిక్షణ ఇచ్చి వారి కుటుంబానికి అండగా నిలబడేలా తీర్చుదిద్దుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి రఘు కుమార్, డీజీఎం (పర్సనల్) అరవింద్ రావు, సీనియర్ పీవో కాంతారావు, సేవా సెక్రటరీ కొట్టె జ్యోతి, సేవా సభ్యులు శారద, తిరుమల, రజిత, సునీత, లక్ష్మి, రమ, సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



