నస్పూర్, ఆర్.కె న్యూస్: అఖిల భారత యువజన సమాఖ్య 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నస్పూర్ మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి శ్రీరాంపూర్ కటిక దుకాణాల దగ్గర జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి మాట్లాడుతూ, 1956 మే 3న భగత్ సింగ్ ఆశయ సాధన కోసం అఖిల భారత యువజన సమాఖ్య ఆవిర్భవించిందని, ఎన్నికల హామీ మేరకు బీజేపీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ఆక్ట్ అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి మహేష్, మండల నాయకులు ఎస్.కె అక్బర్, తిరుపతి, శ్రీనివాస్, రాజేష్, సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
- మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, ఆర్. కె న్యూస్: వేసవి సెలవులలో విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తూ పాఠ్య, పాఠ్యేతర అంశాలను అందిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బాలికల వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, స్పీడ్ మాథ్స్, డాన్స్, మ్యూజిక్, యోగ, మెడిటేషన్, కంప్యూటర్ కోడింగ్, పెయింటింగ్ మొదలైన అంశాలలో శిక్షణ అందించేందుకు శిబిరం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. శారీరక, మానసిక ఎదుగుదలకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని, ఈ నెల 17వ తేదీ వరకు 15 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ఒక బృందం, వ్యవస్థను సమర్థవంతంగా నడిపించే వ్యక్తి నాయకుడని, విద్యార్థులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని అన్నారు. క్రీడలు, ఇతర రంగాలలో జట్టులో ఉన్న సభ్యులందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే విజయం సాధించవచ్చని అన్నారు. ప్రతి రోజు కొత్త విషయాలను నేర్చుకోవాలని, వేసవి శిక్షణ శిబిరాలలో విద్యార్థులకు కొత్త విషయాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. మనం నేర్చుకునే అంశాలను నిశితంగా పరిశీలిస్తే విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని, ప్రజా ప్రయోజనకరంగా వినూత్న ఆవిష్కరణలు రూపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు. ఒక సమస్యను అనేక దారులలో పరిష్కరించవచ్చని, చివరగా పూర్తి స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యమని అన్నారు. క్రీడలు, సంగీతం, చిత్రలేఖనం ఇతర రంగాలలో ప్రయత్నించడమే తొలి విజయమని, ఏకాగ్రత, ఇష్టంతో నేర్చుకుంటే నైపుణ్యత సాధించవచ్చు అని అన్నారు. ఏ అంశంలోనైనా నిరంతరం ప్రయత్నిస్తుంటే ఆ రంగంలో రాణించవచ్చని, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే క్రమశిక్షణ, చిత్తశుద్ధితో ప్రయత్నించాలని తెలిపారు. జిల్లాలోని 18 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల నుండి దాదాపు 200 మంది విద్యార్థినులను తీసుకురావడానికి ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సమన్వయకర్తలు చౌదరి, సత్యనారాయణమూర్తి, నస్పూర్ మండల విద్యాధికారి దామోదర్ రావు, శిబిరం సమన్వయకర్త, నస్పూర్ ప్రత్యేక అధికారి మౌనిక సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- ఏప్రిల్ నెలలో 92 శాతం ఉత్పత్తి సాధించిన శ్రీరాంపూర్ ఏరియా
- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్. కె న్యూస్: సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల రక్షణ, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. బుధవారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏప్రిల్ నెల ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. ఆర్.కె గని 90 శాతం, ఆర్.కె 6 గని 102 శాతం, ఆర్.కె 7 గని 74 శాతం, ఆర్.కె న్యూ టెక్ గని 105 శాతం, ఎస్సార్పీ 1 గని 78 శాతం, ఎస్సార్పీ 3,3ఏ గని 77, ఐకే1ఏ గని 76 శాతం ఉత్పత్తితో భూగర్భ గనులు 84 శాతం ఉత్పత్తి సాధించాయని, ఎస్సార్పీ ఓసిపి 126 శాతం, ఐకే ఓసిపి 28 శాతం ఉత్పత్తితో శ్రీరాంపూర్ ఏరియాలో 92 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించామని తెలిపారు. ఐకే ఓసిపిలో ఓబీ కాంట్రాక్టు కార్మికుల సమ్మె కారణంగా ఉత్పత్తికి ఆటంకం కలిగిందని, ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకుల సమిష్టి కృషితో మే నెల నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. ఏప్రిల్ నెలలో 19 డిపెండెంట్లకు కారుణ్య నియామక పత్రాలు అందజేశామని, నీటి బిందువు – జల సింధువు కార్యక్రమంలో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలో 5 నూతన నీటి కుంటల నిర్మాణంతో 2 పాత చెరువులను పునరుద్ధరణ చేయనున్నట్లు, ప్రాణహిత స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని, సింగరేణి అధ్వర్యంలో పాలిసెట్, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు, వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, ఎస్ఈ (ఐఈడి) కిరణ్ కుమార్, సీనియర్ పిఓ పి. కాంత రావు తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 4న నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
- సీపీ, డీసీపీలకు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు
బెల్లంపల్లి, ఆర్.కె న్యూస్: బెల్లంపల్లి పట్టణంలో చలామణి అవుతున్న నకిలీ విలేకరుల పై మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల డీసీపీ లకు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు ఫిర్యాదు చేశారు. బెల్లంపల్లి పట్టణంలో రిజిస్టర్ ప్రెస్ క్లబ్ ఉండగా మరో ప్రెస్ క్లబ్ ను చలామణి చేస్తూ కొందరు వ్యక్తులు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇందుకు స్పందించిన సీపీ, డీసీపీ లు నకిలీ విలేకరుల పై విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. విలేకరుల పేరుతో ఎవరైనా అక్రమ వసూళ్ల కు పాల్పడితే వారిని గుర్తించి ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని అట్టి వారిపై తగు చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలోని సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీలలో ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కేంద్రాలను ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తనయుడు కొక్కిరాల ఉదయ్ చరణ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొక్కిరాల ఉదయ్ చరణ్ రావు మాట్లాడుతూ, వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి, వేడి నుండి ఉపశమనం పొందడానికి కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు, అంబలి పంపిణీ కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గత కొన్ని సంవత్సరాలుగా గెలుపు ఓటములు సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంబలి పంపిణీ కేంద్రాలు ప్రారంభించడం పట్ల పలువురు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ల వేణు, నాయకులు దర్ని మధు, కుమార్, సంపత్ రెడ్డి, అజయ్ గౌడ్, తిరుపతి, బండి పద్మ, నక్క రాజేశ్వరి, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



