తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సంబరాలు గురువారం మంచిర్యాల కోటపల్లి మండలం పారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వర్ణాల వర్ణ శోభితమైన తీరొక్క పూలతో ఆకర్షణీయంగా బతుకమ్మను స్వయంగా తయారు చేసి ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఆటపాటలతో సందడి చేసి చేశారు. విద్యార్థులను ప్రోత్సహించేందు
KYATHAM RAJESH
అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో వనిత వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికల దినోత్సవ అవగాహన ర్యాలీ, 2కె రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వనిత వాక్కు వ్యవస్థాపక అధ్యక్షులు, అడ్వకేట్ రంగు వేణు కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆడబిడ్డల రక్షణ తమ బాధ్యతగా భావించాలని, ఆడబిడ్డల భద్రత కోసం భరోసా కల్పించాలని అన్నారు. ఆడపిల్లల సమస్యల పరిష్కారానికి, బాలికల సాధికారత, లింగ అసమానతలను రూపుమాపడానికి ప్రపంచవ్యాప్తంగా 2012వ సంవత్సరం నుండి అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జి. ఉదయ్ కుమార్, బెల్లంపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కాశబోయిన సురేష్, సెవెన్ హిల్స్ హై స్కూల్ వ్యవస్థాపకులు గోనె భాగ్యలక్ష్మిలతో కలిసి జ్యోతిని వెలిగించి, 2కె రన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనిత వాక్కు కో-ఫౌండర్స్ కవిత తాళ్లపల్లి, కుర్మ సునీత, జిల్లా గౌరవ అధ్యక్షురాలు జోత్స్న చంద్ర దత్, అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ అన్నపూర్ణ, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ సుమన చైతన్య, చిగురు మంజుల, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ ఉష కాశబోయిన, మంజు భాషిని, చంద్రకళ, టౌన్ ప్రెసిడెంట్ రాచకొండ చందన, డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ ధనలక్ష్మి, పద్మ, ట్రెజరర్ కొండ శైలజ, టౌన్ వైస్ ప్రెసిడెంట్, తిరుమల, పూనం, తేజస్విని, టౌన్ జనరల్ సెక్రెటరీ పద్మ, అవంతి, శారద, భవాని, వనిత వాక్కు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. మంగళవారం చేపట్టిన వాహన తనిఖీల్లో 5 లక్షల 50 వేల రూపాయల నగదు పట్టుకున్నట్లు మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ ఎస్ఐ ఎం. రవి కుమార్ తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా మునగంట కార్తీక్ 5 లక్షల 50 వేల రూపాయలు నస్పూర్ నుంచి మంచిర్యాలకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నారని తెలిపారు. లభించిన రూపాయలకు సరైన ఆధారాలు చూపకపోవడంతో సదరు డబ్బు సీజ్ చేసి తదుపరి విచారణ నిమిత్తం ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ కు అప్పగించామని ఎస్ఐ రవి కుమార్ తెలిపారు.
ఆర్.కె-5 గని కారుణ్య నియామక దరఖాస్తులకు కావాల్సిన వివరాలు:
1. నేమ్ రిమూవల్ లెటర్ మరియు జీతం చిట్టి.
2. కుటుంబ సభ్యుల (భార్య, కుమారులు, కుమార్తెలు) పేర్లు, వయస్సు, చదువు, వృత్తి, సెల్ నెంబర్లు.
3. కుమార్తెల పెళ్లి తేది, అల్లుళ్ల పేర్లు, తండ్రి పేరు, వృత్తి, చిరునామా, సెల్ నెంబర్లు.
4. ఇద్దరు సాక్షుల జీతం చిట్టి జిరాక్స్ మరియు సెల్ నెంబర్లు.
సింగరేణి రిటైర్డ్ కార్మికులకు (ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో రెన్యువల్ చేయాల్సిన) లైఫ్ సర్టిఫికెట్ మరియు హెల్త్ కార్డు రెన్యువల్ సౌకర్యం కలదు.
కావాల్సిన డాకుమెంట్స్:
1. PPO నెంబర్
2. బ్యాంక్ అకౌంట్ నెంబర్
3. హెల్త్ కార్డు నెంబర్
4. ఆధార్ కార్డు
5. మొబైల్ నెంబర్
మీకు కావలసిన అన్ని రకాల ఆన్ లైన్ సేవలు ఒకే చోట:
డిటిపి, కలర్ జిరాక్స్, లామినేషన్, ఇంటర్నెట్, ఆన్ లైన్ అప్లికేషన్స్, పాన్ కార్డ్ సర్వీస్, క్యాష్ విత్ డ్రా, మనీ ట్రాన్స్ ఫర్, ఆధార్ డౌన్ లోడ్, పివిసి ఐడి కార్డ్స్, జీవన్ ప్రమాన్ (డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్), ఐటి రిటర్న్స్ ఈ-ఫైలింగ్, నోటరీ, స్టాంప్ (బాండ్) పేపర్స్ లభించును, వెహికిల్ ఇన్సూరెన్స్, వాయిస్ ఓవర్ సర్వీస్, బస్ & ట్రైన్ టికెట్ బుకింగ్, స్పైరల్ బైండింగ్, Paytm KYC.
కస్టమర్లకు గమనిక: మీకు ప్రూఫ్ ఇచ్చిన డాక్యుమెంట్ ను ఒకటికి రెండు సార్లు సరి చూసుకోగలరు. ప్రూఫ్ చూసుకున్న తర్వాత వచ్చు తప్పులకు మా బాధ్యత లేదు, ఎటువంటి వాదనలకు తావు లేదు.


మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని జెడ్.పి.ఎస్.ఎస్ పాఠశాలలో 1997- 98 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం మంచిర్యాలలోని రామ సుధ రెసిడెన్సి లో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సందడి చేశారు. 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితులు నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుటూ ఆనందంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, శంకర్ రావు లను ఘనంగా సత్కరించారు. ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, శంకర్రావు మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత తమను గుర్తుంచుకొని ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమ దగ్గర చదివిన విద్యార్థులు పలు రంగాల్లో ఉన్నత స్థానంలో ఉండటం, పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అందరూ ఒకచోట కలుసుకోవడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా వ్యవహరించిన గడ్డం సత్య గౌడ్, సురిమిళ్ళ రాజశేఖర్, బండం గోపాల్, ముద్దసాని రమేష్, పెట్టం తిరుపతి, చిందం చంద్రశేఖర్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుఆర్.కె న్యూస్, మంచిర్యాల: జాతీయ ముఖ చిత్రంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమని, రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశం దృష్టిని ఆకర్షిస్తుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ రెమా రాజేశ్వరి, డి.సి.పి. సుధీర్ రామ్ నాథ్ కేకన్, శాసనమండలి సభ్యులు దండే విఠల్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి హాజీపూర్ మండలంలోని దొనబండ ప్రాంతంలో 3 కోట్ల రూపాయలతో 33/11 కె. వి. సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేసి పడ్తనపల్లి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. 85 కోట్ల రూపాయలతో నిర్మించిన పడ్తనపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా 18 గ్రామాలకు సాగునీరు అందుతుందని, తద్వారా సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉండడంతో రెండు పంటలు పండుతాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాలనలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందిందని అన్నారు. దొనబండ ప్రాంతంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు 3 కోట్ల రూపాయలతో 33/11 కె. వి. సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చుకుందని అన్నారు. మంచిర్యాల జిల్లాలో 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, 600 పడకల ఆసుపత్రి నిర్మించడం జరుగుతుందని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఆడపడుచుల ఇబ్బందులను పరిష్కరిస్తూ ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా త్రాగు నీటిని అందించడం జరుగుతుందని, పేదింటి ఆడపడుచు పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పెండ్లి కానుకగా 1 లక్ష రూపాయలను అందించడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల 70 మంది ఆడపడుచుల పెళ్లిళ్లకు 11 వేల కోట్ల రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. మహిళా సంక్షేమం దిశగా కెసిఆర్ కిట్, అమ్మ ఒడి వాహనం, ఆరోగ్య లక్ష్మి, న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాలు అమలు చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వంలో గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా ప్రసవాలు చేసి కేసీఆర్ కిట్లు అందించి అమ్మ ఒడి వాహనం ద్వారా ఇంటి వద్దకు చేర్చడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు సమయానికి 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను 2 వేల రూపాయలకు పెంచి ఇస్తున్నామని, రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 5 వేల రూపాయల పెట్టుబడి సాయం అందించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. సి. ఆర్. ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో ప్రగతి సాధించడం జరిగిందని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
- తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది
- రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: జాతీయ ముఖ చిత్రంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమని, రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశం దృష్టిని ఆకర్షిస్తుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ రెమా రాజేశ్వరి, డి.సి.పి. సుధీర్ రామ్ నాథ్ కేకన్, శాసనమండలి సభ్యులు దండే విఠల్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి హాజీపూర్ మండలంలోని దొనబండ ప్రాంతంలో 3 కోట్ల రూపాయలతో 33/11 కె. వి. సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేసి పడ్తనపల్లి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. 85 కోట్ల రూపాయలతో నిర్మించిన పడ్తనపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా 18 గ్రామాలకు సాగునీరు అందుతుందని, తద్వారా సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉండడంతో రెండు పంటలు పండుతాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాలనలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందిందని అన్నారు. దొనబండ ప్రాంతంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు 3 కోట్ల రూపాయలతో 33/11 కె. వి. సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చుకుందని అన్నారు. మంచిర్యాల జిల్లాలో 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, 600 పడకల ఆసుపత్రి నిర్మించడం జరుగుతుందని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఆడపడుచుల ఇబ్బందులను పరిష్కరిస్తూ ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా త్రాగు నీటిని అందించడం జరుగుతుందని, పేదింటి ఆడపడుచు పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పెండ్లి కానుకగా 1 లక్ష రూపాయలను అందించడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల 70 మంది ఆడపడుచుల పెళ్లిళ్లకు 11 వేల కోట్ల రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. మహిళా సంక్షేమం దిశగా కెసిఆర్ కిట్, అమ్మ ఒడి వాహనం, ఆరోగ్య లక్ష్మి, న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాలు అమలు చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వంలో గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా ప్రసవాలు చేసి కేసీఆర్ కిట్లు అందించి అమ్మ ఒడి వాహనం ద్వారా ఇంటి వద్దకు చేర్చడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు సమయానికి 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను 2 వేల రూపాయలకు పెంచి ఇస్తున్నామని, రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 5 వేల రూపాయల పెట్టుబడి సాయం అందించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. సి. ఆర్. ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో ప్రగతి సాధించడం జరిగిందని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
– శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి
క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలుగుతుందని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని ప్రగతి స్టేడియంలో శ్రీరాంపూర్ జీఎం క్రీడాకారులను పరిచయం చేసుకుని, డబ్ల్యూ.పి.ఎస్ అండ్ జి.ఏ వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ యాజమాన్యం ఖర్చుకు వెనుకాడకుండా అన్ని ఏరియాల ఉద్యోగ క్రీడలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యోగులు తమ పనులను నిర్వహిస్తూనే క్రీడల పట్ల ఆసక్తి కనబరచడం సంతోషకరమని అన్నారు. క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించాలని కోరారు. శ్రీరాంపూర్ ఏరియా క్రీడాకారులు ఏరియా లెవల్ లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి, కంపెనీ, కోల్ ఇండియా స్థాయిల్లో అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించాలన్నారు. జనరల్ మేనేజర్ క్రికెట్ ఆటలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్వోటు జీఎం కె. రఘు కుమార్ ఇన్చార్జి డీజీఎం (పర్సనల్) రాజేశ్వరరావు, స్పోర్ట్స్ సెక్రటరీ పాలకుర్తి రాజు, స్పోర్ట్స్ సూపర్ వైజర్ చాట్ల అశోక్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ తోట సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్.ఆర్.పి 3,3ఏ గనిలో జనరల్ మజ్దూర్ గా పదోన్నతి పొందిన 94 మంది బదిలీ వర్కర్ ఉద్యోగులకు గని డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ సంతోష్ కుమార్ పదోన్నతి పత్రాలు అందజేశారు. శుక్రవారం గని ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గని డిప్యూటీ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకత సాధించి, సంస్థ పురోభివృద్ధికి తోడ్పడాలని కోరారు. బదిలీ వర్కర్ ఉద్యోగులు అనతి కాలంలోనే పదోన్నతి పొందడం సంతోషకరమని అన్నారు. అనంతరం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు భవిష్యత్తులో మరిన్ని పదోన్నతులు పొందాలని ప్రమాదరహిత సింగరేణికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ శ్రీధర్, డిప్యూటీ మేనేజర్ చంద్రముర్ము, ఈ మహేందర్ గౌడ్, సంక్షేమ అధికారి గౌస్ , పిట్ ఇంజనీర్ ప్రేమ్ కుమార్, సీనియర్ అండర్ మేనేజర్లు అరుణ్ కుమార్, మధుసూదన్ రావు, పూర్ణచందర్,ఇంజనీర్ సాయి శ్రావణ్, సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి భాగ్యరాజు, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి సాదుల భాస్కర్, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి మురళి చౌదరి, ఐఎన్టీయూసీ పిట్ కార్యదర్శి కే మనోజ్ కుమార్, సిఐటియు పిట్ కార్యదర్శి శ్రీనివాస్, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
102 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం అభినందనీయం
ఆర్.కె 7 గని మేనేజర్ సాయి ప్రసాద్
సింగరేణి సంస్థ ఉద్యోగుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆర్.కె 7 గని మేనేజర్ సాయి ప్రసాద్ అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియా లోని ఆర్.కె 7 గని ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో గని మేనేజర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో ఆర్కే-7 గని 102 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం అభినందనీయమని, రాబోవు రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. పని స్థలాల్లో రక్షణతో కూడిన ఉత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గడిచిన 6 మాసాల్లో గనిలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోలేదని, ప్రమాద రహిత గనిగా ఆర్కే-7 గని ముందుందని, రక్షణ సూత్రాలు పాటిస్తూ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను అభినందించారు. ప్రతి ఒక్క ఉద్యోగి సేఫ్టీ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం విధులు నిర్వహించాలని, భద్రతతో కూడిన ఉత్పత్తి సాధించే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగుల రక్షణకే సింగరేణి సంస్థ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, రక్షణ పై అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, మన రక్షణ ఇంటి నుండే మొదలవుతుందని విధులకు హాజరయ్యే ప్రతి ఒక్క ఉద్యోగి తప్పనిసరిగా బైకులపై హెల్మెట్ ధరించి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 3.0 లో ఉద్యోగులు భాగస్వాములై గని లోని ప్రదేశాలు, కార్యాలయాలను శుభ్రంగా, సుందరీకరణగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి రవిశంకర్, ఫిట్ ఇంజనీర్ ప్రవీణ్, అండర్ మేనేజర్లు రవీందర్, శ్రీనివాస్, రాజు, సంక్షేమ అధికారి సంతన్, టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీ మెండె వెంకటి, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ బీర రవీందర్, ఐఎన్టియుసి ఫిట్ సెక్రటరీ శ్రీకాంత్, సిఐటియు ఫిట్ సెక్రటరీ శ్రీధర్, బిఎంఎస్ ఫిట్ సెక్రటరీ మహేందర్, హెచ్ఎంఎస్ ఫిట్ సెక్రటరీ రాజేందర్, సూపర్వైజర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



