– రాబోయే ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించాలి
– ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం మితిమీరి పోయిందని, సింగరేణి సంస్థ రాజకీయ నాయకుల చేతిలో బందీగా మారిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ రాజకీయ జోక్యంతో ఆర్థిక దోపిడీ పెరిగి సంస్థ అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని 1998కి ముందు ఏఐటీయూసీ అడగలేదని కొన్ని యూనియన్ల వల్ల సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చాయని గుర్తు చేశారు. సింగరేణిలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ జోక్యం పెరిగి కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణికి దాదాపు 29 వేల కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉందని వాటిని ఇప్పటివరకు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కార్మికుల జీతాలు ఏరియర్స్ చెల్లింపుల కోసం యాజమాన్యం బ్యాంకుల చుట్టూ యాజమాన్యం తిరగాల్సి వస్తోందని ఆరోపించారు. అధికారుల కంటే కార్మికులకు 11వ వేజ్ బోర్డు ఒప్పందం వల్ల కార్మికుల జీతాలు అధికారుల జీతం కంటే ఎక్కువ పెరిగాయని ఇది డిపిఈ గైడ్ లైన్స్ కు వ్యతిరేకమని కోల్ ఇండియాలోని అధికారుల సంఘం జబల్పూర్ హైకోర్టులో కేసు వేయడంతో అక్కడి కార్మికులకు జీతాలు చెల్లింపు నిలిపారని, అధికారుల సంఘం వెంటనే కోర్టు కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ సంఘాలు ఈనెల 12, 13, 14 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. కోలిండియా యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతుందని , ఈ కోర్టు కేసులో సింగరేణి పార్టీ కాలేదని, కార్మికుల జీతాలు చెల్లించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసిన సింగరేణి యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. కోర్టు తీర్పు మేరకు గత నెల 27న డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేశారని, షెడ్యూల్ ప్రకారం యాజమాన్యం ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కార్మిక వర్గం ఏఐటీయూసీని గెలిపించాలని, సంస్థ రక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కె బాజీ సైదా, జాయింట్ సెక్రటరీ రాచర్ల చంద్రమోహన్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, నాయకులు మోహన్ రెడ్డి, నర్సింగ రావు, ఇతినేని శంకర్, సత్తయ్య, గండి సతీష్, సుధాకర్, సుభాష్, భీమయ్య, దొడ్డిపట్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిసిసి నస్పూర్ ఎస్సై ఎం. రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొరగారి పల్లి సమీపంలోని నేషనల్ హైవే, రైల్వే ట్రాక్ సమీపంలోని నాలా పక్కన సుమారు 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి అనారోగ్య కారణాలతో చనిపోయినట్లు తెలిపారు. మృతుడు చిన్న టవల్ ధరించి ఉన్నాడని, మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని కోరారు.
✅ శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి
మానవ జీవితంలో అన్నింటి కంటే విలువైనది ఆరోగ్యమేనని, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిప్యూటీ సీఎంవో డాక్టర్ పి రమేష్ బాబుతో కలిసి ఆర్కే 8 డిస్పెన్సరీలో గుండె సంబంధిత వ్యాధుల పై అవగాహన, కరపత్రాలు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో తప్పనిసరిగా వ్యాయామం, నడక, యోగ లాంటి అంశాలు ఉండేలా చూసుకోవడంతో పాటు శరీరానికి ఆరోగ్యాన్ని అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, కొద్ది దూరానికి వాహనాలు వినియోగించకుండా నడవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ గుండెపోటు నివారణ అంశాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ధూమపానం, మద్యపానం అలవాట్లు మానుకోవాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలన్నారు. శరీర బరువు అదుపులో ఉంచుకుంటూ రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలో పెట్టుకోవాలని తెలిపారు. గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలని, సంబంధిత ఆస్పత్రిలో క్రమం తప్పకుండా చెకప్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ.కె 5, 6 గ్రూప్ గనుల ఏజెంట్ ఏవీ రెడ్డి, డాక్టర్లు వేదవ్యాస్, మురళీధర్, లోకనాథ్ రెడ్డి, స్వప్న, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్కే-న్యూ టెక్ గని ఎస్ఓఎం ఇ.స్వామిరాజు
నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆర్కే-న్యూటెక్ గని ఆదర్శంగా నిలుస్తుందని గని ఎస్ఓఎం ఇ.స్వామిరాజు అన్నారు. మంగళవారం గని ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్కే-న్యూ టెక్ గని ఎస్ఓఎం మాట్లాడుతూ సెప్టెంబర్ మాసంలో ఆర్కే-న్యూటెక్ గని 105 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించిందని, ఇందుకు కృషి చేసిన గని ఉద్యోగులు, సూపర్వైజర్లు, తోడ్పాటు అందించిన కార్మిక సంఘాల నాయకులను అభినందించారు. రాబోవు రోజుల్లో ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. పని స్థలాల్లో రక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పని చేసే ప్రదేశాలు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలన్నారు. కంపెనీ వ్యాప్తంగా ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 3.0లో ఉద్యోగులు భాగస్వాములై గని లోని ప్రదేశాలు, కార్యాలయాలను శుభ్రంగా, సుందరీకరణగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో గని రక్షణాధికారి కొట్టె రమేష్, సంక్షేమాధికారి పాల్ సృజన్, వెంటిలేషన్ అధికారి శంకర్, ఇంజినీర్ కృష్ణ, జేఓ స్లాన్లీ జోన్స్, అండర్ మేనేజర్లు సాత్విక్, చంద్రమౌళి, తెబొగకాసం పిట్ కార్యదర్శి జంపయ్య, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, ఐఎన్టీయూసీ పిట్ కార్యదర్శి మహేందర్, బీఎంఎస్ ప్రతినిధి వినయ్ కుమార్, హెచ్.ఎం.ఎస్ పిట్ కార్యదర్శి సురేందర్, సీఐటీయూ పిట్ కార్యదర్శి అజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సార్పీ-3&3ఏ గని కారుణ్య నియామక దరఖాస్తులకు కావాల్సిన వివరాలు:
1. అన్ ఫిట్ లెటర్, జీతం చిట్టి.
2. కుటుంబ సభ్యుల (భార్య, కుమారులు, కుమార్తెలు) పేర్లు, వయస్సు, చదువు, వృత్తి, సెల్ నెంబర్లు.
3. ఇద్దరు సాక్షుల జీతం చిట్టి జిరాక్స్ మరియు సెల్ నెంబర్లు.
ఫోటోలు:
1. కుటుంబ సభ్యుల పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు (ఒక్కొక్కరివి 2)
2. సాక్షుల పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు – 2
సింగరేణి రిటైర్డ్ కార్మికులకు (ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో రెన్యువల్ చేయాల్సిన) లైఫ్ సర్టిఫికెట్ మరియు హెల్త్ కార్డు రెన్యువల్ సౌకర్యం కలదు.
కావాల్సిన డాకుమెంట్స్:
1. PPO నెంబర్
2. బ్యాంక్ అకౌంట్ నెంబర్
3. హెల్త్ కార్డు నెంబర్
4. ఆధార్ కార్డు
5. మొబైల్ నెంబర్
మీకు కావలసిన అన్ని రకాల ఆన్ లైన్ సేవలు ఒకే చోట:
డిటిపి, కలర్ జిరాక్స్, లామినేషన్, ఇంటర్నెట్, ఆన్ లైన్ అప్లికేషన్స్, పాన్ కార్డ్ సర్వీస్, క్యాష్ విత్ డ్రా, మనీ ట్రాన్స్ ఫర్, ఆధార్ డౌన్ లోడ్, పివిసి ఐడి కార్డ్స్, జీవన్ ప్రమాన్ (డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్), ఐటి రిటర్న్స్ ఈ-ఫైలింగ్, నోటరీ, స్టాంప్ (బాండ్) పేపర్స్ లభించును, వెహికిల్ ఇన్సూరెన్స్, వాయిస్ ఓవర్ సర్వీస్, బస్ & ట్రైన్ టికెట్ బుకింగ్, స్పైరల్ బైండింగ్, Paytm KYC.
కస్టమర్లకు గమనిక: మీకు ప్రూఫ్ ఇచ్చిన డాక్యుమెంట్ ను ఒకటికి రెండు సార్లు సరి చూసుకోగలరు. ప్రూఫ్ చూసుకున్న తర్వాత వచ్చు తప్పులకు మా బాధ్యత లేదు, ఎటువంటి వాదనలకు తావు లేదు.


తెలంగాణ నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్
ఆర్.కె న్యూస్, నస్పూర్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నేతకాని కులస్తులకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పోటీకి అవకాశం కల్పించాలని తెలంగాణ నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్ అన్నారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 19 ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగల స్థాయిలో నేతకాని జనాభా ఉందన్నారు. నేతకాని కులస్తులపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. నేతకానీలు ఎదగడానికి అన్ని పార్టీలు ఎక్కువ శాతం టికెట్లు కేటాయిస్తే పార్టీలకతీతంగా గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో నేతకాని కులస్తులకు భవనం ఏర్పాటు చేయాలని, మంచిర్యాల జిల్లాలోని నేతకాని భవన్ నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని కోరారు. గతంలో నేతకాని అని సర్టిఫికెట్ ఇచ్చేవారని ప్రస్తుతం ఆన్లైన్ లో నెట్ కాని అని ఉండడంతో విద్యార్థుల ఉన్నత చదువులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వెంటనే సవరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ లో నేతకానీలకు అవకాశం కల్పించకపోవడం సరికాదన్నారు. నేతకాని సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామెర ప్రకాష్, నాయకులు దుర్గం నగేష్, రాంటెంకి శంకర్, సంతోష్, యువరాజ్, శంకరయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
– మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
సత్యం, అహింసలను ప్రపంచానికి చాటిన మహాత్ముడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పెంట రాజయ్యతో కలిసి జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో గల మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో అహింస, సత్యాగ్రహం తో మహాత్మా గాంధీ ముఖ్యపాత్ర పోషించారని, బాపూజీగా, జాతిపితగా, మహాత్మగా నిలిచారని అన్నారు. సహాయ నిరాకరణ, స్వదేశీ వస్త్రధారణ లాంటి అహింస మార్గాలలో స్వాతంత్రం కోసం పోరాటం చేశారని అన్నారు. మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించి గాంధీ జయంతి రోజున ప్రపంచ అహింసా దినోత్సవంగా ప్రకటించడం గర్వంగా ఉందని అన్నారు. మహాత్మా గాంధీ సత్యం, అహింస మార్గాలను తాను స్వయంగా ఆచరించి ఆదర్శంగా నిలిచారని అన్నారు. మహాత్మా గాంధీ చెప్పిన శుభ్రత ప్రస్తుతం అందరూ పాటిస్తున్నామని, గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి అని చెప్పిన బాపూజీ మాటలు ఆచరిస్తున్నామని అన్నారు. మహనీయులు చూపిన మార్గాలు ఆచరణ నీయమని, ప్రతి ఒక్కరు వారి ఆశయాలు పాటించాలని అన్నారు. అనంతరం అహింసా శాఖాహార ర్యాలీలో పాల్గొన్నారు. శాఖాహారం అమృతాహారం అని, మాంసాహారం వద్దని, శాఖాహారం తిని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జీవరాశి మనుగడకు సహకరించాలని, మాంసాహారం నిషేధించే పర్యావరణాన్ని కాపాడుకుందామని, మొక్కలు నాటి సంరక్షించుకుందామని అన్నారు. జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ తో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
– రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
మునుపెన్నడూ జరుగని విధంగా తెలంగాణ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని, రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం జిల్లాలోని మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ -కోప లక్ష్మీ. సుంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల పరిధిలో 312 కోట్ల 96 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో 25 కోట్ల ప్రత్యేక నిధులు, 15 కోట్ల డి.ఎం.ఎఫ్.టి. నిధులు మొత్తంగా 40 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, 15.16 కోట్ల రూపాయలతో రామకృష్ణాపూర్ పట్టణంలో నిర్మించిన 286 రెండు పడక గదుల ఇండ్ల ప్రారంభించడం జరిగిందని, 50 కోట్ల రూపాయలతో గాంధారి వనం వద్ద 250 ఎకరాలలో నిర్మించే కె.సి.ఆర్. ఆర్బన్ పార్క్ పనులకు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. రామకృష్ణాపూర్ లోని ఠాగూర్ స్టేడియంలో జి.ఓ. 76లో భాగంగా 7వ విడత సింగరేణి ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గాన్ని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని, ఈ క్రమంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని ప్రోత్సహించడం జరుగుతుందని, రైతులతో పాటు యువతకు ఉపాధి కల్పించే దిశగా 500 కోట్ల రూపాయలతో ఆయిల్ ఫామ్ సాగు ఫ్యాక్టరీ నిర్మించేందుకు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుతో నెలకు 12 వేల రూపాయల చొప్పున సంవత్సరానికి 1 లక్షా 50 వేల రూపాయలతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వారు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. బతుకమ్మ మైదానం, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, సమ్మక్క-సారలమ్మ భవనం, పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా 50 కోట్ల రూపాయలతో కె.సి.ఆర్. అర్బన్ పార్క్, 50 పడకల మాతాశిశు కేంద్రం, 18 వంతెనలు, కుందారం, మందమర్రి, రామకృష్ణాపూర్ లలో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సింగరేణి స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న అర్హులైన వారికి జి.ఓ.76 ద్వారా పట్టాలు అందించి యాజమాన్య హక్కులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో 1 వేయి 658 కోట్ల రూపాయలతో చెన్నూర్ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1 లక్ష ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీరు అందుతుందని అన్నారు. రామారావుపేట, కుమ్మరికుంట, పెద్దచెరువు లాంటి ఎన్నో చెక్ డ్యామ్ లు, రైతు వేదికలు, గ్రంథాలయాలు లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలో 60 ఏండ్లలో జరుగని అభివృద్ధి 5 ఏండ్లలో చేయడం జరిగిందని చెన్నూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి త్వరలో శుభవార్త వింటారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో చెన్నూర్ నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయని, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు లాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ రైతుబంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ ద్వారా కృషి చేయడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని, 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని, అకస్మాత్తుగా రైతు చనిపోతే కుటుంబం రోడ్డు మీద పడకుండా రైతుభీమా అందించడం జరుగుతుందని, మహిళా సంక్షేమంలో భాగంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కె.సి.ఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య మహిళా కేంద్రాల ఏర్పాటు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు, కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో 12 వేల కోట్లు ఉన్న సింగరేణి సంస్థ టర్నోవర్ నేడు 33 వేల కోట్లు అయిందని, 419 కోట రూపాయల ఉన్న లాభాలు 430 శాతంతో 2 వేల 222 కోట్ల రూపాయలు అయిందని, 18 శాతం ఉన్న లాభాల బోనస్ ను 32 శాతానికి పెంచి అందించడం జరుగుతుందని అన్నారు. 9 సంవత్సరాల కాలంలో కార్మికుల ఖాతాల్లో 2 వేల 700 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని అన్నారు. దసరా బోనస్ 715 కోట్ల రూపాయలు కార్మికులకు అందించడం జరుగుతుందని, దీపావళితో కలిపితే 1000 కోట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
– తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి
– ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థ మనుగడకు ముప్పు పొంచి ఉందని ఏఐటీయుసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాల ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేదని, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణను అడ్డుకునేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసి 4 యేండ్లు అయ్యాయని, కార్మికులు ఆకాంక్ష మేరకు గుర్తింపు సంఘం ఎన్నికలు తక్షణమే నిర్వహించాలన్నారు. సింగరేణిలో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడానికి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. సంస్థలో కార్మికులకు ఇచ్చే జనరల్ మజ్దూర్ పదోన్నతులకు ముఖ్యమంత్రికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రి కార్మికులకు ఇచ్చిన హామీలు 6 కొత్త భూగర్భ గనులు, సొంతింటి పథకం, పేర్ల మార్పు, డిపెండెట్ల వయసు పెంపు, సింగరేణి ఆసుపత్రులను ఆధునీకరించడం లాంటి వాటిపై టీబీజీకేఎస్ మాట్లాడడం లేదన్నారు. యాజమాన్యం కోడ్ ఆఫ్ డిసిప్లిన్ రద్దు చేసి, స్టాట్యుటరీ కమిటీల్లో అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాతినిథ్యం కల్పిస్తే ఎన్నికలు పెట్టమని అడగమన్నారు. గత నెల 30న ఓటర్ లీస్ట్ ఇవ్వాలనే ఆదేశాలను యాజమాన్యం పట్టించుకోకపోవడం పై కోర్టుకు పోతామని తెలిపారు. కార్మికుల వద్ద ఎన్నికలు నిర్వహించాలంటూ పలికే కొన్ని కార్మిక సంఘాలు ఆర్ఎల్సి ముందు జరిగే సమావేశంలో ఎందుకు పాల్గొనడంలేదో కార్మికులు గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు ముస్కె సమ్మయ్య, కె. వీరభద్రయ్య, తౌటం మల్లేష్, రాంచందర్, లచ్చన్న, లక్ష్మణ్, మురళీ చౌదరి, నవీన్ రెడ్డి, అప్రోజ్ ఖాన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
– శ్రీరాంపూర్ ఎస్వోటు జీఎం కె. రఘు కుమార్
– భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం
ఆర్.కె న్యూస్, నస్పూర్: 2023-24 ఆర్ధిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని శ్రీరాంపూర్ ఎస్వోటు జీఎం కె. రఘు కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ ఎస్వోటు జీఎం మాట్లాడుతూ, గత నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంపూర్ ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగిందని తెలిపారు. రాబోయే 6 నెలలు బొగ్గు ఉత్పత్తికి కీలకమని అన్నారు. సెప్టెంబర్ నెలలో శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు ఉత్పత్తి 89 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఆర్కే5 గని 105 శాతం, ఆర్కే6 గని 115 శాతం, ఆర్కే7 గని 102 శాతం, ఆర్కే న్యూటెక్ గని 106 శాతం, ఎస్సార్పీ 1 గని 74 శాతం, ఎస్సార్పీ3 గని 92 శాతం, ఐకె1ఎ గని 79 శాతంతో భూగర్భ గనులు 96 శాతం సాధించాయని, ఎస్సార్పీ ఓసిపి 70 శాతం, ఐకె ఓసిపి 125 శాతంతో శ్రీరాంపూర్ ఏరియా 89 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గత నెలలో ఆర్కే 8, నస్పూర్ డిస్పెన్సరీలో 3 లక్షల విలువ గల కొత్త ఈసీజీ యంత్రాలు అందుబాటులోకి తెచ్చామని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా 500 మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశామని, గైర్హాజరు కార్మికుల కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించమని తెలిపారు. గత నెలలో 41 మంది ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామక పత్రాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిజీఎంలు అరవింద్ రావు, చిరంజీవులు, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ పిఓ కాంత రావు తదితరులు పాల్గొన్నారు.



